వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలు

వైసీపీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి మొట్టమొదటి సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా పర్యటనకు వస్తే అక్కడ జనం ఇచ్చిన షాక్ మామూలుది కాదని చెప్పాలి.అక్కడ నుంచి కూడా అఖండమైన మెజార్టీ ఇచ్చి వైసీపీ కు బంపర్ విజయాన్ని విశాఖ వాసులు అందజేశారు.అసలు పట్టు లేని విశాఖలోనే వైసీపీ జెండా ఎగురవేసే సరికి అంతా అది జగన్ మ్యానియానే అనుకున్నారు.కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ ఇదంతా ఈవీఎంల మ్యానియా అని అంటున్నారు.

151 స్థానాలు అనేసరికి ఒక్కసారిగా ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఫ్యుజ్ లు ఎగిరిపోయాయి.అసలు ఇలా ఎలా సాధ్యం అని ఆ సమయంలో వైసీపీ అభిమానులకే అనుమానం కలిగింది.మహా అయితే గరిష్టంగా 110 స్థానాలు వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు.కానీ 151 వచ్చేసరికి ఏం జరిగిందా అని అంతా అనుమానం పడే సరికి ఇదంతా ఈవీఎంల మహిమే అని అనుకున్నారు.అది కాస్తా నిన్న విశాఖలో జగన్ పర్యటనతో కన్ఫర్మ్ అయ్యిపోయిందని సోషల్ మీడియాలో అంటున్నారు.

నిన్న జగన్ పర్యటనకు నామమాత్రంగా కూడా జనం రాకపోవడం ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించింది.విశాఖలో మొత్తం 15 స్థానాలు ఉండగా 11 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది అలాంటప్పుడు జగన్ లాంటి మాస్ లీడర్ అందులోను సీఎం గా మొట్టమొదటిసారి వస్తున్నారంటే వెల్కమ్ ఏ రేంజ్ లో ఉండాలి కానీ అందుకు పూర్తి విరుద్ధంగా విశాఖ వాసులు షాకిచ్చారని సోషల్ మీడియాలో జగన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.ఈవీఎం లను మ్యానేజ్ చేసినంత ఈజీ కాదు విశాఖ ప్రజలను మోసం చెయ్యడం అని నిరూపించారని అంటూ జనసేన పార్టీ భీమిలి అభ్యర్థి పంచకర్ల సందీప్ ఒక సంచలన ట్వీట్ కూడా పెట్టారు.