అనంతపురంలో వైసీపీ-టీడీపీ వర్గీయుల ఘర్షణ.. హై టెన్షన్ !

TDP vs YSRCP Leaders Fight At Putluru

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వ స్థలంలో దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై మొదలయిన వాగ్వాదం ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, బాటిళ్లతో దాడి చేసుకునే దాకా వెళ్ళింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే పుట్లూరు మండలంలోని కుమ్మనమలలో బస్టాండ్ ముందు టీడీపీ వర్గీయులు ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచాయితీ స్థలంలో షాపు పెట్టడం ఏంటని వైసీపీ నేతలు నిలదీశారు.

YSRCP And TDp

ఈ వాగ్వాదం ఇరువర్గాల మధ్య పెద్దదయి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలు, బాటిళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో టీడీపీకి చెందిన రామాంజనేయులు, బయన్న, వైసీపీకి చెందిన హరిబాబు, శంకర్‌, రామాంజినేయులు, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిందరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఆర్డీఓ మలోల పంచాయితీ స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించారు. ఈ ఘటనలో గాయపడ్డవారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.