తెలంగాణలో తొలి విజయం…ఎవరిదంటే ?

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడయింది. చంద్రాయణ్ గుట్ట మాజీ ఎమ్మెల్యే, ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) శాసనపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం సాధించారు. అక్కడ టీఆర్‌ఎస్ నుంచి సీతారామ్‌రెడ్డి బరిలో ఉండగా… కాంగ్రెస్ నుంచి ఈసా బినోబైద్ మిస్త్రీ బరిలో ఉన్నారు. ఇక్కడ మొదటి రౌండ్ నుంచే అక్బరుద్దీన్ ముందంజలోనే ఉన్నారు. మరోవైపు పాతబస్తీలోని 5 నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. అక్బరుద్దీన్ మెజారిటీకి సంబంధించిన తెలియాల్సి ఉంది. కాగా, గోషా మహల్, యాకుత్ పురాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.