తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్..యువత కోసం ​ కీలక నిర్ణయం

తెలంగాణ నవీకరణలు
తెలంగాణ నవీకరణలు

తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. హైదరాబాద్​లోని ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం , ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను
జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా,
యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఏళ్లుగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువత కోసం సీఎం కేసీఆర్ ​ కీలక నిర్ణయం
తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్ల ను ఏర్పాటు చేయాలని కేసీఆర్​ ఆదేశించారు. ఐఏఎస్,
ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, గ్రూప్‌–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆలిండియా సర్వీసెస్‌ స్టడీ సర్కిల్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో
ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.