ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఏపీ నవీకరణలు
నవీకరణలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడలోని
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు: డార్క్ రూం అసిస్టెంట్ విభాగంలో 01, ఈసీజీ టెక్నీషియన్లు-02, స్పీచ్ థెరపిస్టు-01, ఎంఆర్ఐ టెక్నీషియన్లు-03, సిటీ టెక్నీషియన్లు-02, డయాలసిస్ టెక్నీషియిన్ 01, మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.