నిజాం మ్యూజియం దొంగలు దొరికారు…ఎవరంటే…!

The Nizam Museum Thieves Found
ఇటీవల నిజాం మ్యూజియంలో వజ్రాలు పొదిగి ఉన్న బంగారు టిఫిన్ బాక్సుతో పాటు మరికొన్ని విలువైన బంగారు వస్తువులు చోరీకి గురైన విషయం తెలిసిందే. అయితే నిజాం మ్యూజియంలో చోరీ కేసును పోలీసులు చేధించారు. అత్యంత విలువైన బంగారు టిఫిన్ బాక్స్, టీ కప్పు, సాసర్, బంగారు చెంచాను ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు టాస్క్ ఫోర్సు పోలీసులకి పట్టుబడ్డారు.
nizam-thief
వీరిరువురూ ముంబైలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి టిఫిన్ బాక్స్ సహా మిగిలిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టుబడిన ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన యువకులే అని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అలాగే వారిని ఇప్పుడు రహస్యంగా హైదరబాద్ కు తరలిస్తున్నారు. అరెస్ట్ వివరాలను పోలీసులు నేడు అధికారికంగా వెల్లడించనున్నారు.
nizam-hyderabad