కొమురం భీమ్‌ స్వయం పాలన కోసం వీరోచితంగా పోరాడిన కథ!

Komuram Bheem
Komuram Bheem

అతను ఒక అగ్గి బారాటా. పోరాట యోధుడు. మీసం మెలితిప్పే వీరుడు. గెరిళ్లా పోరాటంలో మడమ తిప్పని త్యాగధనుడు. వీరి పేరు చెబితే నిజాం సర్కారుకు దడ పుట్టేదట. స్వయం పాలన కోసం శ్రమించిన   బిడ్డ కొమురం భీమ్‌. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు హైదరాబాదు విముక్తి కోసం అసఫ్‌ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడినాడు .

1901, అక్టోబర్‌ 22న కొమరం చిన్నూ – సోంబారు దంపతులకు ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌ తాలూకాలోని సంకేపల్లి గ్రామం భీమ్‌ జన్మించాడు. భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి కొమురం భీమ్‌ ప్రాణాలర్పించారు. ప్రతీకలో ‘జల్‌–జంగిల్‌–జమీన్‌’ నినాదానికి నిలిచిపోయూడు.

కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్‌ నైజాం సర్కార్‌ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు. వాళ్లు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్‌ అతన్ని హతమార్చి అసోంకు వెళ్లిపోయాడు.

తేయాకు తోటల్లో పనిచేస్తూ…

భీమ్‌ అసోంలో ఐదేళ్లపాటు ఉన్నాడు. కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ జీవనం సాగించాడు. అక్కడ కూడా గిరిజనులపై దొరలు దాడి చేయడాన్ని గమనించాడు.

నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం..

నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు భీమ్‌. ఇందుకోసం 12 గ్రామాల గిరిజనులతో సైన్యం తయారు చేశాడు. భీమ్‌కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మ రాము కూడా భీమ్‌కు సహచరుడిగా ఉన్నాడు. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమురం కొదమసింహంలా గర్జించాడు.