రెచ్చిపోయిన దొంగలు

రెచ్చిపోయిన దొంగలు

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానిక మహిళ (55) ముక్కు, చెవులు కోసి ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లిపోయారు. రాకాసిపెట్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళపై బుధవారం రాత్రి దుండగులు దాడి చేశారు. ఆమె ఒంటిపై నగలు దోచుకెళ్లిన అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. బాధితురాలైన ఈ మహిళ బోధన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న మహిళగా గుర్తించారు.

ఉదయం అక్కడ పడి ఉన్న మహిళను చూసిన స్థానికులు స్పృహ కోల్పోయిన మహిళను వెంటనే బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఒంటిపై ఉన్న పెద్ద ఎత్తున బంగారు నగలు, దాదాపు 20 గ్రాముల వెండి ఎత్తుకుపోయారని పోలీసులు తెలిపారు. మహిళ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.