ఈ పెద్దోళ్లు పెళ్లికి ఒప్పుకోరని… ప్రేమజంట ఆత్మహత్య.. ఆపై

ఆంధ్రప్రదేశ్ లో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు వాటి కార్యకలాపాలతో నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రపంచమంతా ఓ పక్క కరోనాతో అల్లల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రేమ కార్యకలాపాలతో మునిగి తేలుతూ రాక్షసానందాలకు, ఆత్మహత్యలకు నెలవుగా మారుతుంది.

అయితే రెండు రోజులుగా ఓ యువతి కనిపించడం లేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముబైల్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. కాలేజీ రోజుల నుంచి ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపుతుంది. రెండు రోజుల క్రితం ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరానికి చెందిన ఓ యువతి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అయితే యువతి రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే పాత గుంటూరు పోలీన్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి వివరాలు ఆరా తీసి గాలింపు చర్యలు చేపట్టారు. యువతి మొబైల్ సిగ్నల్ ఆధారంగా బ్రాడిపేటలో ఉన్నట్లు టవర్‌ లొకేషన్‌ చూపించింది.

కాగా లోకేషన్ ఆధారంతో వెళ్లి చూసిన పోలీసులు.. యవతితో పాటూ మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. మృతదేహాలను రెండింటినీ స్వాధీనం చేసుకుని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో యువతి, యువకులు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓకే క్లాస్.. ఇద్దరికి పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారి ఇలాంటి ఘటనకు దారితీసినట్లు సమాచారం అందుతుంది. కాగా యువకుడు ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించక పోవడంతోనే ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.