ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ స్పెషాలిటీ.. ఏమిటో తెలుసా..?

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ స్పెషాలిటీ.. ఏమిటో తెలుసా..?
Latest News, Special News

వినాయక చవితి పండుగని హిందువులందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఖైరతాబాద్ గణపతి ప్రస్తానం 1954లో ఒక్క అడుగుతో మొదలైంది. ఇప్పుడు 69వ సంవత్సరాలకు చేరుకుంది. పర్యావరణహితంగా పూర్తి మట్టితో తయారు చేసిన మహాగణపతి ఈసారి 63 అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వబోతున్నారంట . శుక్రవారం నాడు మహాగణపతికి నేత్రోనిలం కార్యక్రమాన్నికూడా పూర్తి చేశారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని వివిధ రూపాల్లో శిల్పిస్తున్నామని అయిన చిన్న స్వామి రాజేంద్రన్ తెలిపాడు . ఈసారి గణపతి 63 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పులో 45 టన్నుల బరువుతో దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు .

ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ స్పెషాలిటీ.. ఏమిటో తెలుసా..?
Khairathabad Ganesha

ఒక చేతిలో గంధం వరాహదేవితో కలిసి ఉన్న గణపతిని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. ఈ గణపతిని తయారు చేయడానికి ఒక చుక్క కూడా పిఓపి ని ఉపయోగించలేదు. మొదటి స్టీల్ తో రూపును తీసుకొచ్చి ఆ తర్వాత జాలిని అమర్చి, గడ్డి, మట్టితో రెండవ లేయర్ చేసారు. అవుట్ లైన్ గా సాండ్ లాంటివి వాడారు. మొత్తం ఐదు లేయర్లు గణపతిని తయారు చేశారు. వాటర్ పెయింట్ లని కూడా వాడారు దీంతో వర్షం పడినా కూడా విగ్రహం ఏమి కరగదు. నిమజ్జనం టైంలో వర్షం పడినా కూడా ఇబ్బంది ఏమి రాదు నిమజ్జనము పూర్తిగా జరగాక ఎనిమిది గంటల్లో నీటిలో కరుగుతుందని తెలిపారు .