పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి

పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి

జమ్మూ కశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గమ్‌సార్‌ ప్రాంతంలో జరిగింది. మెరుపులతో కూడిన పిడుగుపాటుకు ఓ జంట, మరో వ్యక్తి మరణించినట్లు పూంచ్ జిల్లా సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ రమేష్‌ కుమార్‌ అంగ్రాల్‌ తెలిపారు.

మృతులను సూరన్‌కోట్‌లోని లాథోంగ్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌దిన్‌ కుమారుడు మహ్మద్‌​ హసీక్‌(38), అతని భార్య జరీనా కౌసర్‌(30), మరో వ్యక్తి జావేద్‌ అహ్మద్‌(38)గా పోలీసులు గుర్తించారు. వీరు పశువుల పెంపకం ద్వారా జీవనం సాగించే సంచార జాతికి చెందినవారని తెలిపారు. పిడుగుపాటుకు పెద్ద సంఖ్యలో జంతువులు కూడా మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.