కోల్‌కతాలో ఘోరం…బిల్డింగ్ పైనుంచి ఇద్దరు పిల్లల్ని విసిరేశాడు.. ఒకరు మృతి

death

కోల్‌కతాలో తాజాగా ఘోరమైన ఘటన వెలుగు చూసింది. అదేమంటే… ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి విసిరేశాడు. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ ఇద్దరిలో మరో ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే పశ్చిమ బెంగాల్‌లోని బుర్రాబజార్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. చిన్నారులను భవనం పైనుంచి పడేసిన 55 ఏండ్ల వ్యక్తిని పోలీసు వెంటనే అరెస్ట్‌ చేశారు. కాగా మృతి చెందిన బాలుడు తాలూకూ తండ్రితో తనకు జరిగిన ఘర్షణ కారణంగానే సదరు వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గాయపడిన బాలుడికి.. చనిపోయిన బాలుడికి మధ్య అలాంటి సంబంధ బంధవ్యాలు ఉన్నాయి అనే విషయంపై కూడా పోలీసులు విచారిస్తున్నారు.