ప్రత్యేక అతిథులుగా టాలీవుడ్ బడా స్టార్స్

ప్రత్యేక అతిథులుగా టాలీవుడ్ బడా స్టార్స్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఒకరకంగా తార స్థాయికి చేరుకున్నాయి అనే చెప్పాలి. బన్నీ సరసన గోల్డెన్ లెగ్ హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమాను ఎంతో భారీగా హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, నాలుగు సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ నుండి విశేషమైన స్పందనను రాబట్టడంతో పాటు యూట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ దక్కించుకోవడం జరిగింది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఒకింత భారీగా ప్లాన్ చేసిన సినిమా యూనిట్, అందులో భాగంగా ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పక్కాగా డేట్ ని ఫిక్స్ చేయడంతో పాటు టాలీవుడ్ బడా స్టార్స్ ఇద్దరిని ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాతో పాటు సరిగ్గా ఒక్క రోజు ముందుగా రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 5న చేయబోతున్నారు, అలానే ఆ వేడుకకు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచేస్తుండడంతో, ఎలాగైనా తమ సినిమా పై కూడా ప్రేక్షకుల దృష్టి ఉండేలా బన్నీ,అరవింద్ కలిసి అలవైకుంఠపురములో ఈవెంట్ ని జనవరి 6న ప్లాన్ చేస్తున్నారని, తప్పకుండా ఇద్దరు స్టార్ హీరోలు దానికి అతిథులుగా రావడం ఖాయం అని తెలుస్తోంది.

ఇప్పటికే సాంగ్స్ విషయంలో సరిలేరు కంటే ఒకింత ముందుగా దూసుకెళ్తున్న అలవైకుంఠపురములో సినిమాని ఎలాగైనా హిట్ చేసి, తన ఖాతాలో మరొక హిట్ ని వేసుకోవాలని చూస్తున్నారు త్రివిక్రమ్. అలానే బన్నీతో కలిసి గతంలో తాను పనిచేసిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాదించడంతో, తప్పకుండా తమ కాంబినేషన్లో ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్ ఖాయం అని త్రివిక్రమ్ కూడా భావిస్తునట్టు టాక్. మరి సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి.