విజయనిర్మల అంత్యక్రియలు రేపు

tomorrow funeral of vijayanirmala

గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన తొలి మ‌హిళా ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మల హైద‌రాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న‌ కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం అర్ధ‌రాత్రి క‌న్నుమూశారు. ఆమె మ‌ర‌ణంతో టాలీవుడ్ శోక‌సంద్రంలో మునిగింది. సినీ ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప్ర‌ముఖులు ఆమెకి నివాళులు అర్పించారు. విజ‌య నిర్మల ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు. ఈ రోజు ఉద‌యం 10 గం.ల‌కి విజ‌య నిర్మల పార్ధివ‌దేహాన్ని నానక్‌రామ్ గూడలోని ఆమె ఇంటికి త‌ర‌లించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆసుపత్రిలో ఆమె భౌతికకాయం పక్కనే ఆమె భర్త కృష్ణ, కుమారుడు నరేష్ ఉన్నారు. ఆమె భౌతికకాయాన్ని ఈరోజు ఇంట్లోనే ఉంచి, అభిమానుల సందర్శనార్థం రేపు ఫిల్మ్ ఛాంబర్ కు తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.  అంత్యక్రియల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.