2018లో త్రివిక్రమ్‌ నుండి ట్రిపుల్‌ ట్రీట్‌..!

Triple treat from Trivikram srinivas in 2018

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాటల మాంత్రికుడు సంవత్సరంకు ఒక్క సినిమా చొప్పున తీసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెంట వెంటనే సినిమాలు చేయాలని భావించినా కూడా ఆయన చేస్తోన్న హీరోలు మాత్రం ఆయనకు సపోర్ట్‌ చేయడం లేదు. ఆ కారణంగా త్రివిక్రమ్‌ సంవత్సరంలో ఒక్క సినిమాను విడుదల చేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు. త్రివిక్రమ్‌ ఈ సంవత్సరంలో ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయాడు. పవన్‌తో తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ఈ సంవత్సరంలో విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. అయితే వచ్చే సంవత్సరంలో అలా జరగకుండా త్రివిక్రమ్‌ జాగ్రత్త పడుతున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్‌ 2018 సంవత్సరంలో ఏకంగా మూడు చిత్రాలను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో మొదటిది పవన్‌ ‘అజ్ఞాతవాసి’ కాగా రెండవది ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోతున్న చిత్రం. ఎన్టీఆర్‌తో ఇటీవలే ప్రారంభం అయిన చిత్రాన్ని వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నారు. ఆ చిత్రం షూటింగ్‌ను అయిదు నెలల్లోనే పూర్తి చేయాలని త్రివిక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. దసరాకు ఎన్టీఆర్‌ మూవీ వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ మూవీ పూర్తి అయిన వెంటనే వెంకటేష్‌ మూవీ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌, వెంకటేష్‌ల కాంబో మూవీ కూడా 2018లోనే విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇలా కెరీర్‌లోనే మొదటి సారి త్రివిక్రమ్‌ ఒకే సంవత్సరంలో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇది సాధ్యం అయ్యి తీరాలని త్రివిక్రమ్‌ పట్టుదలతో ఉన్నాడు.