ప్లాన్ మార్చిన త్రివిక్రమ్

ప్లాన్ మార్చిన త్రివిక్రమ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న “అల వైకుంఠపురములో” చిత్రం ఇప్పుడు విడుదలకు సంసిద్ధం అవుతుంది.చాలా కాలం గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లోనే ఏ సినిమా నుంచి వచ్చిన నాలుగు సాంగ్స్ కూడా ఒకదానిని మించి ఒకటి హిట్టయ్యాయి.

అయితే ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయో కానీ అవి అలాగే ట్రైలర్ అసలు సిసలైన మరో కీలక ఘట్టం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈ చిత్ర యూనిట్ నుంచి ఇంకా బాకీ ఉన్నాయి.ఇప్పటికే మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రీలీజ్ ఈవెంట్ ను వారు జనవరి 5 న అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిధిగా వస్తున్నారని ఖరారు చేసేసారు.సో ఇంక మిగిలి ఉంది అల వైకుంఠపురములో మాత్రమే కాబట్టి అందరి దృష్టి దానిపై పడింది.అయి తే ఆ మధ్య ఈ చిత్రానికి మెగాస్టార్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడని ఏవేవో బజ్ వినిపించాయి.

ఇది ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడైతే త్రివిక్రమ్ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది.ఈ చిత్రానికి ముఖ్య అతిధిగా తన ఆప్తుడు మరియు అత్యంత సన్నిహితుడై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను త్రివిక్రమ్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే గతంలో బన్నీ మరియు త్రివిక్రమ్ లు చేసిన మొదటి చిత్రం “జులాయి”కి పవన్ వచ్చారు.అది బంపర్ హిట్ అయ్యింది.అలాగే “సన్నాఫ్ సత్యమూర్తి”కి రాలేకపోయినా విషెష్ చెప్పారని త్రివిక్రమ్ అప్పుడు ఫంక్షన్ లో చెప్పారు.అలా ఇప్పుడు కూడా ఏమన్నా లింక్, సింక్ కుదిరిందా అని అనిపిస్తుంది.మరి ఇది ఒట్టి బజ్ గా నిలిచిపోతుందో లేక నిజంగానే వస్తారేమో చూడాలి.