కర్ణాటకలో ఘోర ప్రమాదం : 12 మంది మృతి

twelve people died in an accident in karnataka

కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో ఇవాళ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ప్రయివేటు బస్సు – ఆటో రీక్షా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.