మోడీ హత్యకి కుట్ర… రెక్కీ కూడా !

Unidentified flying object-UFO on Modi Home

మోడీ అంతమే లక్ష్యంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతికి సిద్ధమవుతోందని ఒకవైపు, అలాగే మావోయిస్టులు సైతం మోదీ హత్యకు కుట్ర పన్నాయని మరోవైపు నేషనల్ మీడియా కొద్ది రోజులుగా మోత మోగిస్తోంది. అయితే ఇదంతా బూటకమని, మోదీకి బలం తగ్గినట్టు అనిపిస్తే మోడీ మీద సానుభూతిని పండించుకోవడం కోసమే బీజేపీ ఈ రకమైన వ్యూహాలు పన్నుతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే హోమ్ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా ప్రధాని మోదీకి ఏర్పాటు చేస్తున్న భద్రతపై లోతైన సమీక్ష జరిపి సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశారు.

ఇంత హై అలెర్ట్ ఉన్న నేపథ్యంలోనే ఒక వార్త ఇప్పుడు ప్రభుత్వ-బీజేపీ వర్గాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్త్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర ఒక ‘గుర్తుతెలియని ఎగిరే వస్తువు’ (Unidentified flying object-UFO) సంచరిస్తోందన్నది వార్త ఇప్పుడు భద్రతా వర్గాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నెల 7న సరిగ్గా వారం రోజుల కిందట మోదీ నివాసం ఉంటున్న ఢిల్లీ ‘లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌’ వద్ద ఆకాశంలో UFO కనిపించినట్లు అక్కడున్న సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసరే ఫిర్యాదు నమోదు చేశారు. ఇన్నాళ్లు అమెరికాలో మాత్రమే కనిపించిన యూఎఫ్‌ఓ (ఎగిరే సాసర్‌ లాంటి వస్తువు)లు ఇప్పుడు భారతదేశంలో కూడా కనిపించడం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసమైన ‘లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌’ వద్ద ఆకాశంలో ఒక గుర్తు తెలియని వస్తువు తిరగడం చూసామని సీనియర్‌ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఆ వస్తువెంటో తెలుసుకుందామని ప్రయత్నించామని కానీ దాని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదని, దాంతో భద్రతా అధికారులు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన నివేదికలో ‘అంతా సవ్యంగానే ఉంద’ని తెలిపారన్నారు.

ఈ విషయం గురించి ఢిల్లీ స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దీపేంద్ర పథక్‌ ‘ప్రధాని నివాసం వద్ద ఏదో గుర్తుతెలియని వస్తువు ఆకాశంలో చక్కర్లు కొట్టడం అయితే వాస్తమే. కానీ తర్వాత జరిపిన భద్రతా తనిఖీల్లో ప్రమాదకరమైనదేది మా దృష్టికి రాలేద’ని తెలిపారు. అంతేకాక భద్రతా కారణాల దృష్ట్యా అది యూఎఫ్‌ఓనా లేకా మరేదైన వస్తువా అనే విషయం గురించి మాత్రం తాము బయటకు వెల్లడించలేమని తెలిపారు. ఇలా గుర్తు తెలియని… అనుమానాస్పద వస్తువులు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది సెప్టెంబర్‌ 17 రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్రోన్‌లాంటి వస్తువేదో పార్లమెంట్‌ భవనం చుట్టూ చక్కర్లు కొట్టినట్లు ఢిల్లీ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వచ్చింది. కానీ ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) రాడార్‌లో మాత్రం అటువంటిదేమి రికార్డవ్వలేదని సెక్యూరిటి అధికారులు తెలిపారు. ఇప్పుడు కూడా 24 గంటలూ నాలుగంచెల భద్రత కొలువుండే మోదీ నివాసం దగ్గర జరిగిన ఈ ఘటన పట్ల నిఘా వర్గాలు అంతర్గతంగా ఆరా తీస్తున్నాయని తెలిసింది.