మహేష్‌25 టైటిల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…

vamshi paidipally tweet on Mahesh 25 film title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 25వ చిత్రం కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా స్పైడర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్‌ను దక్కించుకోలేక పోయిన మహేష్‌ ప్రస్తుతం తన 24వ చిత్రం ‘భరత్‌ అను నేను’ను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. తాజాగా ‘భరత్‌ అను నేను’ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత దానయ్య ప్రకటించాడు. ఆ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ఒక వైపు జరుగుతుండగా మరో వైపు మహేష్‌ 25వ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. మహేష్‌ 25వ చిత్ర దర్శకుడు వంశీపైడిపల్లి అనే విషయం తెల్సిందే. 

ప్రస్తుతం మహేష్‌ 25 చిత్రం కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి విదేశాల్లో దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీతాన్ని చేయిస్తున్నాడు. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌కు సంబంధించిన ఫొటోలను తాజాగా ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేయడం జరిగింది. అశ్వినీదత్‌ మరియు దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి ‘హరేరామ హరేకృష్ణ’ మరియు ‘కృష్ణ ముకుంద మురారి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ రెండు టైటిల్స్‌లోంచి ఒక్కదాన్ని త్వరలోనే నిర్ణయిస్తారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే ఆ వార్తలు పుకార్లే అంటూ దర్శకుడు తేల్చి పారేశాడు. 

తాజాగా ట్విట్టర్‌ ద్వారా దర్శకుడు వంశీ పైడిపల్లి టైటిల్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఇంకా సినిమాకు టైటిల్‌ నిర్ణయించలేదని, నిర్ణయించిన వెంటనే పోస్ట్‌ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. మహేష్‌బాబు కెరీర్‌లోనే విభిన్నంగా ఉండేలా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. పూజా హెగ్డేను మహేష్‌బాబుకు జోడీగా ఎంపిక చేయడం జరిగింది. వచ్చే దసరాకు మహేష్‌25 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటున్న వంశీ పైడిపల్లి మహేష్‌ 25వ చిత్రాన్ని కూడా సక్సెస్‌ చేస్తాడని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.