కాంగ్రెస్ పతనానికి వీర్రాజు కనిపెట్టిన కారణం

veeraju defines reason for congress flop

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోవును పట్టుకుని రాజకీయం చేసే జాడ్యం బీజేపీని వదలడం లేదు. ఇన్నాళ్లు ఉత్తరాది నేతలే ఆవు గురించి ఎక్కువ మాట్లాడేవాళ్లు. ఇప్పుడా రోగం దక్షిణాదికి పాకింది. రాజమండ్రిలో సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సమ్మేళనంలో పాల్గొన్న వీర్రాజు.. కాంగ్రెస్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గోభక్షణ పార్టీ కాబట్టే పతనమైందన్న ఆయన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.

మొన్నటి దాకా బీజేపీ పతనానికి కారణమేంటో కూడా ఆయనే సెలవివ్వాలని కాంగ్రెస్ నేతలు సెటైర్లేస్తున్నారు. బీజేపీ లెక్క ప్రకారం ఆవును పూజించే వాళ్లంతా ప్రధానులు కావాలని అంటున్నారు. ఓవైపు కేంద్రమంత్రి వెంకయ్యే స్వయంగా తాను మాంసాహారిని అల సెలవిస్తుంటే.. ఇంకా ఆవు తోక పట్టుకుని గంగానది ఈదడం ఎప్పుడు మానేస్తారని బీజేపీ నేతలపై విమర్శల వర్షం కురుస్తోంది.

మాట్లాడితే మోడీ పనిమంతుడు, నీతిమంతుడు అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు.. కాంగ్రెస్ ఫస్ట్ టర్మ్ లో కూడా అవినీతి బయటపడని సంగతి ఎవరో ఒకరు పనిగట్టుకుని గుర్తుచేయాలేమో. ప్రధాని మోడీ మీద మొహం మొత్తినప్పుడు అవినీతి దానంతట అదే బయటకి వస్తుంది. నోట్ల రద్దు వెనుక బాగోతం చెప్పడానికి నోరు రాని కమలనాథులు మూడేళ్ల క్రితం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీపై నిందలేయడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు విశ్లేషకులు.

సుక్కూకు చిర్రెత్తుకు వస్తుందట!