మళ్లీ ఎన్టీఆర్‌ను వాడాలని బాబు ప్లాన్‌

Chandra Babu Plans To Use NTR Again

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Chandra Babu Plans To Use NTR For Elections

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అనూహ్యంగా మారింది. వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవ్వడం అనుమానమే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష వైకాపా బలపడటంతో పాటు, పవన్‌ పార్టీ జనసేన కూడా ఏపీలో పుంజుకునే ఛాన్స్‌ ఉంది. త్రిముఖ పోటీతో పాటు బీజేపీ కూడా సొంతంగానే కుంపటి వెలిగించే అవకాశం ఉంది. దాంతో అక్కడ హంగ్‌ ఏర్పడనుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. అందుకోసం చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తన కొడుకులకు పార్టీలో స్థానం కల్పించడం లేదని, గుర్తింపు దక్కకుండా చేస్తున్నారంటూ హరికృష్ణ గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటున్నాడు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయినా కూడా హరికృష్ణ పార్టీ మీటింగ్‌లకు హాజరు కావడం లేదు. ఆ మద్య పార్టీపై బాహాటంగానే విమర్శలు చేసిన హరికృష్ణను బుజ్జగించేందుకు చంద్రబాబు నాయుడు అండ్‌ టీం ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హరికృష్ణకు టీటీడీ పదవి ఇచ్చి, ఎన్టీఆర్‌ను మచ్చిక చేసుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. 2019 ఎన్నికల్లో నందమూరి హీరోలు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లతో పాటు బాలకృష్ణ, హరికృష్ణ కూడా ప్రచారం చేయాలని చంద్రబాబు కోరుకుంటున్నాడు. అలా చేయడం వల్ల నందమూరి అభిమానులతో పాటు ప్రజలు తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారని బాబు ఆశిస్తున్నాడు. మరి ఎన్టీఆర్‌ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు

నాగార్జున ఫస్ట్‌టైం..!

నానికి ఎంత ధైర్యం… చెప్పి మరీ చేస్తున్నాడు.