మళ్ళీ సందడి చేయనున్న హీరోలు

మళ్ళీ సందడి చేయనున్న హీరోలు

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ తోడల్లుళ్లుగా స్క్రీన్‌పై సందడి చేసిన సినిమా ‘ఎఫ్‌ 2’ (‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’). అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్‌ 3’ తెరకెక్కించబోతున్నట్టు అనిల్‌ రావిపూడి ఆ మధ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ సీక్వెల్‌ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నుంచి సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం. ‘ఎఫ్‌2’లో కనిపించిన వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ఇందులో కనిపించనున్నారు. వారికి జోడీగా తమన్నా, మెహరీనే కనిపిస్తారు. మరి.. కాంబినేషన్‌లో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి. అలాగే వీరితో పాటు ఇంకో హీరో కూడా సందడి చేయనున్నారని టాక్‌.