Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మరి కొద్ది గంటల్లోనే ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. రేపు శుక్రవారం ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2400 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కేవలం ఓవర్సీస్లో 2000 ప్రివ్యూలు వేస్తున్నారు. మూడు రోజుల్లో ఓవర్సీస్లో 10వేల షోలు వేయాలన్నది ప్లాన్. ఇంత భారీ ప్రణాళికల నడుమ దర్శకనిర్మాతలు మీడియా ఇంటరాక్షన్స్, ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు.
స్వయంగా మహేష్ రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా లవర్ బాయ్ ఇమేజ్ లోను, మాస్ హీరో గాను కనిపించిన మహేష్ రాజకీయ నాయకుడిగా ఎలా నటించాడు, ముఖ్యమంత్రిగా ఎలా అలరించాడు అనే విషయాలని తెర మీద చూసేందుకు వారు సన్నద్దం అవుతున్నారు.
తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ముఖ్యమంత్రి పాత్ర గురించి ఆసక్తి కరమైన విషయాన్ని వెల్లడించాడు. మహేష్ బాబు మొదటి 15 నిమిషాల వరకే సాధారణంగా కనిపిస్తాడని ఆతరువాత సీఎం ఐపోతాడని అన్నారు. ఇక సినిమా చివరి వరకు మహేష్ ముఖ్యమంత్రిగానే కనిపిస్తాడని కొరటాల ఉత్కంఠ పెంచేశారు. మిగతా విషయాలు మీరు వీడియోలో చూడచ్చు
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు తయారయ్యింది పాపం కత్తి మహేష్ పరిస్థితి. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కోచ్ అనే అంశం మీద పోరాటాలు, నిరసనలు జరుతున్న సంగతి తెలిసిందే. శ్రీ రెడ్డి అనే సినీనటి ప్రారంభించిన ఈ నిరసన ఇప్పుడు ఇండస్ట్రీ లో అనేక మంది మహిళా నటులు తమకి జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. అయితే ఈ మొత్తం కార్యక్రమాలని కొన్ని టీవీ చానెళ్ళు తమ స్టూడియో కేంద్రంగా లైవ్ ఇస్తున్నాయి. అన్యాయం జరిగిందని చెప్పుకునే మహిళలతో బాటు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులలా కొంతమందిని టీవీ చానెళ్ళ వారే పిలిచి కూర్చో బెడుతున్నారు. అయితే వారిలో ఒకడిగా కత్తి మహేష్ ని కూడా చానెళ్ళు పిలిచి కుర్చోబెడుతున్నాయి. అయితే ఈరోజు కూడా టీవీ9 చర్చా కార్యక్రమంలో ఉన్న కత్తి మహేష్ కి లైవ్ కి వచ్చిన ఓ మహిళా ఆర్టిస్ట్ షాక్ ఇచ్చింది. కత్తి మహేష్ తనని బలవంతం చేసాడు అని ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
కత్తి మహేష్ ని ఎదో పెద్ద రాయుడిలాగా తెచ్చి కుర్చోబెడుతున్నారు మహిళా ఆర్టిస్ట్స్ మీద జరిగే అఘాయిత్యాలు విషయంలో అసలు కత్తి మహేష్ కూడా అలాంటోడే అయినప్పుడు అతన్ని తీసుకొచ్చి ఎలా కూర్చోబెడతారు అని ఆమె ప్రశ్నించింది. కత్తి మహేష్ టీవీ లైవ్ లో పక్కనుండగానే ఆయన తనను వాళ్లింటికి రమ్మని పిలిచాడని.. గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని.. తనను కొట్టాడని వెల్లడించింది. కత్తి మహేష్ సంవత్సరం క్రితమే తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారని, ఆయన అంతకు ముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారని అలాగే ఒకసారి నేను అమీతుమీ ఆడియో ఈవెంట్లో మహేష్ కలిసినపుడు అక్కడున్న పరిస్థితిని చూసి ఆయనకు చాలా క్రేజ్ ఉన్నట్టుంది అనుకున్నానని తెలిపింది.
అప్పటి వరకూ ఆయన నాకు జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్ మాత్రమే అయిన ఆయన గురించి తనకేమి తెలియదని కాని బిగ్ బాస్ షో లో ఆయన్ని చుసిన తాను ఈయనేంటి బిగ్బాస్కి రావడమేంటని షాక్ అయ్యానని అలాగే ఎలిమినేషన్ అయ్యాక.. సర్ మీ బిగ్బాస్ చూశాను చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పానని అయితే బిగ్బాస్ షోలో ఫోన్లో మాట్లాడినపుడు మీ వైఫ్తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్కి వచ్చారు అని అడిగానని కాని నా మీద ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్బాస్లో అందుకే వెనక్కి వచ్చాను మహేష్ అన్నారని అలాగే ఆయన తిరిగి వచ్చిన రోజునే కలుస్తావా నన్ను అని అడిగారని ఆమె తెలిపింది. అయితే ఈ అంశం మీద కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వెళ్లానని, కాని ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్కి, కత్తి మహేష్కి కాంట్రవర్సీ జరుగుతోంది కాబట్టి ఆయనకీ మీడియా సపోర్ట్ ఉంటుందని మహేష్పై కంప్లైంట్ తీసుకోలేమని పోలీసులు చెప్పారని సునీత తెలిపింది.
బిగ్ బాస్ కి వెళ్ళక ముందుకసారి తనను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడని బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత రోజునే తనను రమ్మని ఫేస్బుక్లో అడ్రస్ పెట్టాడని కావాలంటే ఫేస్బుక్లో మెసేజ్ కూడా చూపిస్తా అని ఆమె తెలిపింది. తీరా వెళ్లాక కమిట్మెంట్ ఇస్తావా? అని అడిగాడని కాని తాను ముందే చెప్పానని ఎవరికి పడితే వారికి కమిట్మెంట్ ఇవ్వనని అసలు దానికి అంగీకరించను అన్నందుకు తన మీద చేయి చేసుకుని లోపాలకి తోసి డోర్ కూడా లాక్ వేశాడని ఆమె ఆరోపించింది. తర్వాత బస్ టికెట్కి రూ.500 ఇచ్చి పంపించాడని కత్తి మహేష్ కి సంబంధించి అన్ని ప్రూఫ్స్ చూపిస్తా అని ఆమె తెలిపింది. అయితే ఈ విషయం మీద కత్తి స్పందిస్తూ సునీత తనకి మంచి ఫ్రెండ్ అని సునీత తన వద్ద డబ్బుల్లేవంటే నేను అప్పుడప్పుడు డబ్బు సాయం చేసేవాడినని ఆమె ఒకసారి తన ఇంటికి వస్తే బయటే మాట్లాడి పంపించానని తర్వాత ఇంటికి వస్తే డబ్బులిచ్చి పంపించానని అయితే నాపై సునీత అటెమ్ట్ టు రేప్ అంటూ అర్ధం లేని ఆరోపణలు చేస్తోందని తాను అలాంటివాడిని కాదని ఆమె దగ్గర ఆధారాలు ఉంటె ఆమె లీగల్ గా వెళ్ళచ్చునని తెలిపారు.
ఈ అంశం మొత్తంగా పరిశీలిస్తే కత్తి మహేష్ ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే వెళ్లి కేస్ పెట్టుకోమనడం చూస్తే కత్తి మహేష్ తెంపరితనం కనపడుతోంది. ఎందుకంటే ఫేస్ బుక్ లో మెసేజ్ లు ఉన్నాయని ఆమె అంటున్నా భయపడకపోవడం చూస్తే ఆ చాట్ లో భయపడే అంశాలు ఏమి ఉండి ఉండక పోవచ్చు, అలాగే ఆమెని కొట్టిన, లాగి తలుపు వేసిన ఘటనల ఆధారాలు దొరకడం అంటే కుదిరేపని కాదు, సో కత్తి మహేశ్ లీగల్ గా వెళ్ళమని ఉండచ్చు. అలాగే ఇంతకు ముందు కొంతమంది అమ్మైలతో చాట్ లు బయటపడినప్పుడు ఇలానే ఒక ఛానెల్ లో చర్చలో కూర్చోబెడితే చర్చ మధ్యలో యాంకర్ , ”మీరు స్త్రీ లోలుడని చెబుతున్నారు” దానికి మీ సమాధానం ఏంటి అంటే అవును అమ్మాయిలకు మెసేజ్ పెట్టాను. మీరు అంటే నాకు ఇష్టం అని చెప్పాను. మీరు నాకు కావాలి అని కూడా అడుగుతా. మీరే కాదు నాకు ఎవరు నచ్చిన ఇదే మాట చెబుతాను. ఇందులో తప్పు ఏంటి ? అది నా హక్కు ఇది తప్పు ఎలా అవుతుంది అంటూ తిరిగి యాంకర్ నే ప్రశ్నించే మహేష్ ఇలా కొన్ని ఆరోపణలకి ఎలా భయ పడతాడు ? మన పిచ్చి గానీ
మారుతున్న కాలానికి అనుగుణంగానే ఇప్పుడు అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఒకరకంగా చెప్పాలంటే ట్రెండ్ మారుతోంది, అది కొన్ని రంగాలకే పరిమితం కాకుండా అన్ని రంగాలు ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కి సరిపోయేట్టు సిద్దమవుతున్నాయి. విద్య విషయానికి వస్తే ఒకప్పుడు విద్య నేర్చుకునేందుకు అరణ్యాలలో ఉండే గురువుల వద్ద వారి గురుకులంలో ఉండి విద్య నేర్చుకునేవారు. అది క్రమేపీ మారుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే విద్య అనేది డిజిటల్ వరకు వచ్చేసింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే డిజిటల్ క్లాస్లలోనే విద్యా భోదన జరుగుతుండగా మన దేశంలో కూడా డిజిటల్ విద్యా భోదన మొదలయ్యింది. అయితే తెలుగు రాష్ట్రాలలో పేరెన్నికగన్న విద్యాసంస్థగా ముద్రపడిన నారాయణ దానిని విద్యార్ధులకి మరింత చేరువ చేసే దానికి శ్రీ కారం చుట్టింది.
తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్య అనేది ఎవరికీ తెలియని తెలియచెప్పి ఎంతో మంది విద్యార్ధులని డాక్టర్ లని, ఇంజినీర్ లని చేసిన నారాయణ సంస్థ ఇప్పుడు విద్య ని డిజిటలైజ్ చేసేందుకు నడుం బిగించింది. జూనియర్ కాలేజీ విద్యార్ధులు అంటే ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలే గుర్తొస్తాయి. అటువంటి విద్యార్ధులకి ఎంతో ఉపయుక్తంగా ఉండే ‘ఎన్ లెర్న్’ అనే మొబైల్ అప్లికేషన్ ని విడుదల చేసింది నారాయణ. ఈరోజు మాదాపూర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నారాయణ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా || సింధూర లాంచ్ చేశారు.
అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు 40 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రత్యేక సందర్భంలో ఈ డిజిటల్ విద్య అనే కాన్సెప్ట్ కి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యకి పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి యాప్ ఒకటి తాయారు చేశామని, విద్యారంగంలో ఇటువంటి నూతన ఆవిష్కరణ చేయడంలో నారాయణ ఒక వేదిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలోనే మొట్టమొదటగా విద్యావిధానానికి సాంకేతికత జోడించిన విద్యాసంస్థగా నారాయణ ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని అన్నారు.
ఇక యాప్ విషయానికి వస్తే యాప్ మొత్తం మూడు విభాగాలుగా విభజించడం జరిగింది, అందులో ఒకటి నేర్చుకోవడం దేశంలోనే నిష్ణాతులయిన అధ్యాపకుల చేత ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ మాత్రమే కాకుండా ముఖ్యమయిన పుస్తకాల్ని డిజిటలైజ్ చేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇక రెండవ విభాగం పరీక్షలు, మొత్తం మూడు సబ్జెక్టులలో సుమారు 500 టాపిక్స్ కవర్ చేయడం ద్వారా 50000 ప్రశ్నలు అందుబాటులో ఉంటాయి, ఇవన్నీ మల్టిపుల్ ఆన్సర్ టైపులో ఉంటాయి.
ఇక పోతే మూడవ విభాగం వాల్యుయేషన్, అంటే విద్యార్ధులు యాప్ లో వ్రాసిన పరీక్షలకి వెనువెంటనే అక్కడే సమాధానాలు రావడం వల్ల ఎక్కడెక్కడ తప్పు చేశారు, ఎలా సరిదిద్దుకోవాలి అనేది అర్ధమవుతుంది. ఈ యాప్ పోటీ పరీక్షల విద్యార్ధులకి వరం అనే చెప్పాలి. అయితే కాస్త నిరుత్సాపరిచే విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ యాప్ నారాయణ విద్యార్ధులకి మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఇంకొద్దిరోజుల్లో విద్యార్ధులందరికి నామమాత్రపు రుసుముతో ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది.
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గతంలో సోషల్ మీడియాలో బాగా వెనుకబడి ఉండే కాంగ్రెస్… ఇప్పుడు మాత్రం బీజేపీకి దీటుగా సామాజిక మాద్యమాలను ఉపయోగించుకుంటోంది. ప్రతి సందర్భంలోనూ సోషల్ మీడియా వేదికగా కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. తాజాగా ఏప్రిల్ 1 ఫూల్స్ డే ను కూడా కాంగ్రెస్ వినూత్నంగా వాడుకుంది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ వీడియోను రూపొందించి అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఆ వీడియోలో ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది. మోడీ ప్రభుత్వం 200 కోట్ల ఉద్యోగాలు కల్పించిందని, అంగారక గ్రహం నుంచి గ్రహాంతరవాసులు కూడా ఇప్పుడు భారత్ లో ఉద్యోగాలు చేస్తున్నారని ఎద్దేవా చేసింది.
మోడీ సర్కార్ ప్రధాన ఎన్నికల నినాదమయిన స్మార్ట్ సిటీపైనా వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. స్మార్ట్ సిటీలో చెత్తను రోబోలు సేకరిస్తున్నాయని కామెంట్లు గుప్పించింది. నమామీ గంగా ప్రాజెక్టుపైనా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. చెత్తా, చెదారంతో నిండిన గంగానదిలో ఇప్పుడు మోడీ చిత్రపటం కూడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యంగాస్త్రం విసిరింది. మొత్తానికి ఈ కాంగ్రెస్ మార్క్ బ్రేకింగ్ న్యూస్ వీడియోను ఆ పార్టీ వర్గాలు తెగ షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒక విమర్శచేస్తే ప్రతిగా వంద విమర్శలు గుప్పించే, బీజేపీ సోషల్ మీడియా ఈ వీడియోపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి తీయబోతున్న మల్టీస్టారర్ సినిమా గురించి ఇప్పటిదాకా ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆ సినిమా రావాలని తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఆశించినప్పటికీ అది నిజమో, కాదో అన్న సందిగ్ధం ఎక్కడో ఉండేది. ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్, చరణ్ తో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా గురించి కొద్దిసేపటి కిందట అధికారిక ప్రకటన వచ్చింది. RRR మూవీస్ పేరుతో వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాలో హల్ ఛెల్ చేస్తోంది. అందుకు సంబందించిన వీడియో మీకోసం.
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
1988లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఏక్..దో…తీన్ సాంగ్ రీమిక్స్ వెర్షన్ విడుదలయింది. తేజాబ్ సినిమాలోని ఈ సాంగ్ మాధురీ దీక్షిత్ ను ఓవర్ నైట్ స్టార్ చేసింది. అప్పటికే బాలీవుడ్ ను ఏలుతున్న శ్రీదేవికి మాధురీని పోటీగా నిలబెట్టింది. హిందీలోనేకాదు..దేశవ్యాప్తంగానూ ఈ పాట ఉర్రూతలూపింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ ఆ సాంగ్ ను రీమిక్స్ చేసింది. 2016లో రిలీజయిన బాఘి సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న బాఘీ 2లో దర్శకుడు అహ్మద్ ఖాన్ ఏక్..దో…తీన్ సాంగ్ రీమిక్స్ చేశారు. మాధురి స్థానంలో ఈ పాటలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ డాన్స్ చేసింది. మాధురి పాటను ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ పాడగా… రీమిక్స్ పాటను శ్రేయాఘోషల్ ఆలపించింది. అహ్మద్ ఖాన్ స్వతహాగా కొరియోగ్రాఫర్ కావడంతో రీమిక్స్ పై చాలా శ్రద్ధ తీసుకున్నాడు.
పాత పాటతో ఈ పాటను పోల్చకుండా అన్నీ కొత్త స్టెప్పులు కంపోజ్ చేశాడు. పాటలో ఒకే ఒక్క స్టెప్పు మినహా మిగిలినవన్నీ కొత్త స్టెప్పులే. పాత స్టెప్పులతో పోలిక లేకపోవడం వల్లే తాను భయం కలగకుండా డ్యాన్స్ చేయగలిగానని జాక్వలిన్ తెలిపింది. మాధురీదీక్షిత్ డ్యాన్స్ చేసినంత గొప్పగా ఎవరూ చేయలేరని,ఈ పాటకు తనను ఎంచుకున్నప్పుడు మొదట తాను చేయగలనా అని భయం వేసిందని, అయితే అన్నీ కొత్త స్టెప్పులని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నానని చెప్పుకొచ్చింది. కాగా, మాధురి పాట ఏడు నిమిషాలు ఉండగా..కొత్త పాట రెండు నిమిషాలకు తక్కువగానే ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కొత్త పాట వైరల్ అవుతోంది.