కృష్ణార్జున‌యుద్దం టీజ‌ర్ రిలీజ్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

krishnarjuna yuddham movie Teaser released

నేచుర‌ల్ స్టార్ నానీ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం టీజ‌ర్ రిలీజ‌యింది. ఓ పాత్ర‌లో నాని క్లాస్ గా, మ‌రో పాత్ర‌లో మాస్ హీరోగా న‌టిస్తున్నాడు. యాడున్నార్రా గోపిక‌లు అని నాని అడ‌గ‌గానే హీరోయిన్లు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, రుక్స‌ర్ మీర్ టీజ‌ర్ లో క‌నిపించారు. కృష్ణ పాత్ర‌లో నాని ఆడోళ్లు క‌ఠినాత్ములు అంటుండ‌గా… అర్జున్ పాత్ర‌లో నాని మాత్రం అమ్మాయిల‌ను ప‌డేయ‌డం ఎంత ఈజీనో చెప్తున్నాడు.

రామాయ‌ణమంతా విని ధ‌ర్మరాజు ఎవ‌రు అని అడిగిన‌ట్టుంది అని నాని జోక్ చేయ‌డం… రామాయ‌ణంలో ధ‌ర్మ‌రాజుంటాడు, కృష్ణంరాజు, ఎడిట‌ర్ గౌతంరాజు కూడా ఉంటాడు అన్న జోక్ న‌వ్వు తెప్పిస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న కృష్ణార్జున‌యుద్ధానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వేస‌వి సెల‌వుల సంద‌ర్భంగా ఏప్రిల్ 12న‌ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రంగస్థలం రంగమ్మ…. మంగమ్మ సాంగ్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అప్పుడు విజ‌య‌శాంతి… ఇప్పుడు న‌య‌న‌తార‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
Nayanathara-Karthavyam-Movi

గ్లామ‌ర్ హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించిన న‌య‌న‌తార ఇప్పుడు మాత్రం క‌థా ప్రాధాన్య‌మున్న చిత్రాల్లో న‌టిస్తూ మంచిన‌టిగా నిరూపించుకుంటోంది. అందుకే త‌మిళంలో ఎంత‌మంది హీరోయిన్లున్నా న‌య‌న‌తార‌కున్న క్రేజ్ వేరు. ఈ క్రేజ్ తోనే ఆమె కోసం ర‌చ‌యిత‌లు కొత్త క‌థ‌లు రాస్తున్నారు. అలా ఆమెను వ‌రించిన అవ‌కాశ‌మే ఆరాం. త‌మిళంలో భారీ విజ‌యం సాధించిన ఆరాంలో క‌లెక్ట‌ర్ గా న‌య‌న‌తార న‌ట‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. న‌య‌న‌తార కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌త్యేకంగా భావించింది. సినిమాలో న‌టించడం వ‌ర‌కే త‌న ప‌నిగా భావిస్తూ… ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండే న‌య‌న‌తార‌… ఆరాం సినిమాకు మాత్రం త‌న వ్య‌వ‌హార‌శైలికి భిన్నంగా ప్ర‌మోష‌న్ లో పాల్గొంది. ఓ థియేట‌ర్ లో అభిమానుల మ‌ధ్య కూర్చుని ఆరాం వీక్షించింది. గోపీ నైనార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆరాం… న‌య‌న‌తార న‌ట‌నా ప్ర‌తిభ‌కు అద్దం ప‌ట్టింద‌ని త‌మిళ ప్రేక్ష‌కులు చెప్పుకున్నారు. దీంతో ఈ సినిమాను తెలుగులోకి డ‌బ్ చేస్తున్నారు శ‌ర‌త్ మ‌రార్.

న‌య‌న‌తార‌కు తెలుగులోనూ బానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో పాటు… ఆరాంకు వ‌చ్చిన పాజిటివ్ టాక్..అన్ని ప్రాంతాల‌కు క‌నెక్ట‌య్యే క‌థ‌కావ‌డంతో క‌ర్త‌వ్యం పేరుతో ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నాడు శ‌ర‌త్ మ‌రార్. క‌ర్త‌వ్యం టీజ‌ర్ ను కొద్దిసేప‌టి క్రితం రిలీజ్ చేశారు. ప్ర‌జ‌ల‌కు ఏది అవ‌స‌ర‌మో అదే చ‌ట్ట‌మ‌వ్వాలి గానీ… చ‌ట్టాన్ని ముందే త‌యారుచేసి దాన్ని ప్ర‌జ‌ల మీద రుద్ద‌కూడ‌దు అని టీజ‌ర్ లో న‌య‌న‌తార చెబుతున్న డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ఒక‌ప్పుడు లేడీసూప‌ర్ స్టార్ గా పేరుపొందిన విజ‌య‌శాంతికి క‌ర్త‌వ్యం సినిమా ఎంత పేరు తెచ్చిందో… ఇప్పుటి లేడీ సూప‌ర్ స్టార్ అయిన న‌య‌న‌తార‌కు ఈ సినిమా అంత పేరు తెస్తుంద‌ని… చిత్ర‌యూనిట్ చెబుతోంది.

మెర్క్యూరీ మూవీ ట్రైలర్

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎయిర్ పోర్ట్ లో తార‌క్, చెర్రీ… వీడియో వైర‌ల్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న‌యితే రాలేదు కానీ… బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ మాత్రం వేగంగా జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి తార‌క్, చెర్రీపై ఫొటో షూట్ నిర్వ‌హించ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ ఫొటో షూట్ జ‌రిపేది ఇండియాలో కాదు… అమెరికాలోన‌ని తెలుస్తోంది. తారక్, చెర్రీ క‌లిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క‌నిపించ‌డం ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుస్తోంది. చెరో బ్యాగ్ త‌గిలించుకుని… ఎయిర్ పోర్ట్ లో ఇద్ద‌రూ స‌ర‌దాగా ముచ్చ‌టించుకుంటున్న ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

సినిమాకు సంబంధించి వ‌ర్క్ షాప్ ను అమెరికాలో నిర్వ‌హించ‌నున్న రాజ‌మౌళి… అక్క‌డే ఇద్ద‌రు హీరోల‌పై ఫొటో షూట్ ను కూడా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. సినిమా ఎనౌన్స్ మెంట్ స‌మ‌యంలో ఈ ఫొటోలు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇందుకోస‌మే ఇద్ద‌రూ అమెరికా వెళ్లార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలంటున్నాయి. తార‌క్, చెర్రీ ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే రాజ‌మౌళి సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌రణ్ న‌టించిన రంగ‌స్థ‌లం షూటింగ్ పూర్తిచేసుకుని ఈ నెల 30న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా… ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. బోయ‌పాటి, త్రివిక్ర‌మ్ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే రాజ‌మౌళి త‌న సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు.

సాయిప‌ల్ల‌వి అలాంటి హీరోయిన్ కాదు…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మ‌ల‌యాళ ప్రేమ‌మ్ సినిమాతోనూ, తెలుగులో ఫిదా తోనూ సాయిప‌ల్ల‌వి ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ముఖ్యంగా ఫిదా రిలీజ్ త‌ర్వాత సాయిప‌ల్ల‌వికి తెలుగులో డిమాండ్ పెగిరిపోయింది. వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఆ క్రేజ్ కొన‌సాగుతుండ‌గానే… ఆమెను ప‌లు వివాదాలు చుట్టుముట్టాయి. ఎంసీఏ సినిమా షూటింగ్ లో హీరో నానితో గొడ‌వ‌ప‌డింద‌ని, దిల్ రాజు సినిమా ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించింద‌ని, సూర్య హీరోగా న‌టిస్తున్న‌ సినిమ షూటింగ్ కు ఆల‌స్యంగా వ‌స్తోంద‌ని… సెట్లో చాలా పొగ‌రుగా ఉంటుంద‌ని… ఇలా ఆమెపై వ‌రుస ఫిర్యాదులు వినిపించాయి. ఇవి విన్న‌వారికి ఆమె తొలిరోజుల్లోనే కెరీర్ నాశ‌నం చేసుకుంటోంద‌న్న భావ‌న క‌లిగింది. అయితే ఇలాంటి విమ‌ర్శ‌లు అంద‌రిమీదా స‌హజంగా వ‌చ్చేవే అని… కాక‌పోతే సాయిప‌ల్ల‌వి కాస్త ముక్కుసూటి మ‌న‌స్త‌త్వంతో ఉంటుంది కాబ‌ట్టి ఇంకొంచె ఎక్కువ‌గా వినిపిస్తున్నాయ‌ని… ఇవేవీ ఆమె కెరీర్ కు ప్ర‌తిబంధ‌కాలు కావ‌ని ఇండ‌స్డ్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అదే స‌మ‌యంలో నేటి హీరోయిన్ల వైఖ‌రి పూర్తి భిన్నంగా ఉండే సాయిప‌ల్ల‌వి ప్ర‌వ‌ర్త‌న‌నూ వారు ఎంత‌గానో మెచ్చుకుంటున్నారు. రెండు, మూడు సంఘ‌ట‌న‌లను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతూ ఆమె స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తంచేస్తున్నారు. మామూలుగా ఒక‌సారి ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి ఒక‌టి, రెండూ స‌క్సెస్ లు సాధించిన త‌ర్వాత… హీరోయిన్ల వైఖ‌రి మారిపోతుంది. లైఫ్ స్ట‌యిల్ లో చాలా తేడా వ‌స్తుంది. ప్ర‌తి విష‌యంలోనూ స్టార్ హోదాకు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హరిస్తుంటారు. కానీ సాయిప‌ల్ల‌వి మాత్రం అలా కాదంటున్నారు. ఆమె సింప్లిసిటీ… హీరోయిన్ల‌లో ఆమెను విభిన్నంగా ఉంచుతుందంటున్నారు. అందుకు క‌ణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. త‌మిళంలో క‌రు పేరుతో రూపొందిన సినిమాను తెలుగులో క‌ణం పేరుతో విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సాయిప‌ల్ల‌వి హైద‌రాబాద్ వ‌చ్చింది.

అయితే ఆమె చెన్నై నుంచి బ‌య‌లుదేరిన విమానం హైద‌రాబాద్ కు ఆల‌స్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్ట్ నుంచి పార్క్ హ‌య‌త్ హోట‌ల్ కు వ‌చ్చిన సాయిప‌ల్ల‌వి… ప్రీ రిలీజ్ వేడుక‌కు బ‌య‌లుదేరింది. ఆ స‌మ‌యంలో దారిలో ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండ‌డంతో కారు వ‌ద్ద‌ని చెప్పి… ఆమె అసిస్టెంట్ బైక్ పై ప్ర‌సాద్ ల్యాబ్ ద‌గ్గ‌ర‌కు చేరుకుంది. ఆమె అలా బైక్ పై రావ‌డం చూసిన వాళ్లంతా… ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె స‌మ‌య‌స్ఫూర్తిని అభినందించారు. మ‌రో హీరోయిన్ అయితే ఇలా బైక్ పై రావ‌డం అన్న‌ది ఊహించ‌గ‌ల‌మా..ఈ విష‌యంలోనే కాదు… మేక‌ప్ విష‌యంలోనూ సాయిప‌ల్ల‌వి మిగ‌తా హీరోయిన్ల‌తో పోలిస్తే ఇలానే విభిన్నంగా ఉంటుంది. సినిమాల్లోనే కాదు… బ‌య‌ట ఏ కార్య‌క్ర‌మం జరిగినా… హీరోయిన్లు మేక‌ప్ లేకుండా బ‌య‌ట‌కు రారు. అవ‌స‌ర‌మున్నా లేక‌పోయినా… మొహం నిండా మేక‌ప్ ద‌ట్టిస్తుంటారు. కానీ సాయిప‌ల్ల‌వి అలా కాదు… బ‌య‌టే కాదు… సినిమాల్లోనూ మేక‌ప్ లేకుండానే ఆమె న‌టించేయ‌గ‌ల‌దు. ప్రేమ‌మ్ సినిమాలో అలా మేక‌ప్ లేకుండానే క‌నిపించి సాహసం చేసిన సాయిప‌ల్ల‌వి… ధ‌నుష్ హీరోగా తెర‌కెక్క‌బోతున్న సినిమాలో కూడా మ‌రో మారు మేక‌ప్ లేకుండా న‌టించ‌బోతోంది. మొత్తానికి సాయిప‌ల్ల‌వి… ఇలా త‌న సింప్లిసిటీతో ఎప్పటిక‌ప్పుడు తానెంతో భిన్న‌మైన క‌థానాయికో నిరూపించుకుంటోంది.

లైవ్ లో యాంక‌ర్ త‌ల‌పై ఎర్ర‌ని ప‌క్షి…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లైవ్ లో స్పెష‌ల్ ప్రోగ్రాం చేస్తున్న ఇద్ద‌రు యాంక‌ర్ల‌కు ఓ స్పెషల్ గెస్ట్ స‌డెన్ స‌ర్ ప్ర‌యిజ్ ఇచ్చింది. ఫిమేల్ యాంక‌ర్ కు ఆ స్పెషల్ గెస్ట్ ఇచ్చిన స‌ర్ ప్ర‌యిజ్ చూసి మేల్ యాంక‌ర్ ప‌డీ ప‌డీ న‌వ్వాడు. అమెరికాలోని శాన్ డియాగోలోని కెఎఫ్ ఎంబీ చాన‌ల్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆ స్పెష‌ల్ గెస్ట్ ను, అది చేసిన ప‌నిని చూసి నెటిజ‌న్లు మ‌న‌సారా న‌వ్వుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే… కెఎఫ్ఎంబీ చాన‌ల్ లో యాంక‌ర్ మెడినా… త‌న కో యాంక‌ర్ ఎర్రిక్ క‌హెన‌ర్ట్ తో క‌లిసి జూడే గురించి లైవ్ లో మాట్లాడుతోంది… మెడినా మాట్లాడుతుండ‌గానే… ఓ ప‌క్షి వ‌చ్చి మెడినా త‌ల‌పై వాలి కొద్దిసేపు అలానే ఉంది. స‌డ‌న్ గా ప‌క్షి వ‌చ్చి అలా వాల‌డం చూసిన కో యాంక‌ర్ ఎర్రిక్ కు న‌వ్వాగ‌లేదు. ఆ ప‌క్షిని చూస్తూ ప‌డీప‌డీ న‌వ్వాడు. మెడినా మాత్రం ఎలాంటి కంగారూ లేకుండా ప్రశాంతంగా న‌వ్వుతూ కూర్చుంది.

కొద్దిసేప‌టి త‌ర్వాత ఆ ప‌క్షి మెడినా త‌ల‌పైనుంచి లేచి ఎర్రిక్ పై వాల‌బోయింది. కానీ ఎర్రిక్ అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో వెంట‌నే ఎగిరిపోయింది. అస‌లు న్యూస్ ప్ర‌సార‌మయ్యే గ‌దిలోకి ప‌క్షి ఎలా వ‌చ్చింద‌న్న సందేహం వ‌స్తోందా… నిజానికి చాన‌ల్ నిర్వాహ‌కులే ఆ ప‌క్షిని తీసుకువ‌చ్చారు. జూడే సంద‌ర్భంగా ప‌క్షుల గురించిన ప్ర‌త్యేక‌కార్య‌క్ర‌మం కోసం ఐబిస్ జాతికి చెందిన ఎరుపురంగు ప‌క్షిని తీసుకొచ్చారు. లైవ్ లో త‌నను చూపించేదాకా ఎందుకు ఆగ‌డం అనుకుందో ఏమో ఆ ప‌క్షి తానంత‌ట తానే ఎగురుతూ యాంక‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి… ఎంచ‌క్కా త‌ల‌పై వాలి కూర్చుని… కాసేపు ప్రేక్ష‌కుల‌కు క‌నిపించి మ‌ళ్లీ ఎగిరిపోయింద‌న్న‌మాట‌.

క్రికెట్ ఆడుతున్న కరుణానిధి.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం తనదైన ముద్రవేసి వయసు మీద పడడంతో ఇంటికే పరిమితం అయిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఏమి చేస్తున్నాడో తెలుసా ? . క్రికెట్ ఆడుకుంటున్నాడు. మీరు నమ్మినా ,నమ్మకపోయినా అది నిజం. రెండేళ్ల మునిమనవడు (అరుళ్ నిధి కొడుకు ) కి కరుణానిధి కుర్చీలో కూర్చునే బౌలింగ్ చేస్తున్నాడు. ఈ అరుదైన దృశ్యాన్ని కరుణానిధి కుటుంబసభ్యులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. కావాలంటే మీరు కూడా ఓ లుక్ వేయండి.

లైవ్ లో పోట్లాడుకున్న యాంక‌ర్లు …వీడియో వైరల్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లైవ్ లో న్యూస్ చ‌దివేట‌ప్పుడు న్యూస్ రీడ‌ర్లు చాలా అప్ర‌మ‌త్తంగా ఉంటారు. కోపం, న‌వ్వు, ఆనందంలాంటి ఎలాంటి ఫీలింగ్స్ నైనా కంట్రోల్ చేసుకుని ముఖంలో ఎలాంటి భావాలూ ప‌లికించ‌కుండా న్యూస్ చ‌దువుతారు. వ్య‌క్తిగ‌త విష‌యాలను ఆ స‌మ‌యంలో ప‌క్క‌న‌పెట్టి ప్రొఫెష‌న‌లిజం చూపిస్తారు. న్యూస్ రీడ‌ర్లు వార్త‌లు చ‌దివే స‌మ‌యంలో ఎంత నిబ‌ద్ధ‌తో ఉంటార‌నేదానికి కొన్ని నెల‌ల క్రితం భార‌త్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌. ఓ న్యూస్ రీడ‌ర్ బులెటిన్ ను ముగించ‌బోయే స‌మ‌యంలో బ్రేకింగ్ న్యూస్ ఒక‌టి వ‌చ్చింది. రిపోర్ట‌ర్ ఆ న్యూస్ కు సంబంధించిన ఫోన్ ఇన్ కూడా ఇచ్చారు.

ఆ బ్రేకింగ్ న్యూస్ చ‌దివిన న్యూస్ రీడ‌ర్ ఫోన్ ఇన్ కూడా మామూలుగానే తీసుకుంది. అది ఓ యాక్సిడెంట్ కు సంబంధించిన న్యూస్. ఫోన్ ఇన్ లో రిపోర్ట‌ర్ యాక్సిడెంట్ అయిన కారు నెంబ‌ర్, యాక్సిడెంట్ అయిన ప్ర‌దేశం, మృతుల వివ‌రాలు చెప్పాడు. ఫోన్ ఇన్ లో మామూలుగానే ప్ర‌శ్న‌లు అడిగిన న్యూస్ రీడ‌ర్ త‌రువాత వార్త‌ను  ముగించి ఒక్క‌సారి పెద్ద‌పెట్టున ఏడ్చింది. దానికి కార‌ణం యాక్సిడెంట్ అయిన కారు ఆమె భ‌ర్త‌దే. మృతుల్లో ఆమె భ‌ర్త కూడా ఉన్నారు. అయినా స‌రే పంటిబిగువున బాధ‌ను అదిమిపెట్టి…వార్త‌ను చ‌దివిన ఆమె బులెటిన్ ను ముగుస్తూనే కుప్ప‌కూలిపోయింది. వృత్తి ప‌ట్ల ఆ న్యూస్ రీడ‌ర్ చూపిన అంకిత భావంపై అప్ప‌ట్లో ఎంత‌గానో ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఇలా కొంద‌రు వ్య‌క్తిగ‌త బాధ‌ల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టి న్యూస్ చ‌దివేట‌ప్పుడు నిబద్ధ‌తతో ఉంటే మ‌రికొంద‌రు మాత్రం చిన్న చిన్న గొడ‌వ‌ల‌ను కూడా లైవ్ లో కొన‌సాగించి..త‌మ వార్తా సంస్థ‌ల‌ను అభాసుపాలు చేస్తున్నారు. డైలీ పాకిస్థాన్ న్యూస్ చాన‌ల్ లో జరిగిన ఇలాంటి ఘ‌ట‌న ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ చాన‌ల్ కు చెందిన ఇద్ద‌రు న్యూస్ రీడ‌ర్లు బ్రేక్ స‌మ‌యంలో గొడ‌వ‌ప‌డ్డారు. మేల్ న్యూస్ రీడ‌ర్, ఫిమేల్ న్యూస్ రీడ‌ర్ పై   ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు.

సాధార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితి ఎద‌రైతే లైవ్ వ‌చ్చేముందే న్యూస్ రీడ‌ర్లు, యాంక‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. కానీ వీరు మాత్రం బ్రేక్ అయిపోయి లైవ్ లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా గొడ‌వ‌ను కంటిన్యూచేశారు. ఇటువంటి యాంక‌ర్ తో నేను  ఎలా బులెటిన్ కొన‌సాగించాలి అని మేల్ యాంక‌ర్ అన‌గా…మాట‌లు స‌రిగ్గా రానీయ్ అని ఫిమేల్ యాంక‌ర్ క‌స్సుమంది. 30 సెక‌న్ల పాటు సాగిన ఈ సంభాష‌ణ‌ను ప్రేక్ష‌కులు లైవ్ లో చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. న్యూస్ చాన‌ల్ కు చెందిన ఒక ఉద్యోగి ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో ఉంచ‌డంతో అది వైర‌ల్ గా మారింది. క్యూట్ పాకిస్థాన్ యాంక‌ర్స్ అంటూ నెటిజ‌న్లు వారిని కామెంట్లుచేస్తున్నారు. 

కొడుకుని కాల్చిన బన్నీ …వైరల్ అయిన వీడియో

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రియ వారియర్ ఒక్క వీడియో తో యుట్యూబ్ లోను అటు సోషల్ మీడియా అకౌంట్స్ పేస్ బుక్ ,ఇంస్టాగ్రాం లలో కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది .ఆమె కి అన్ని వైపులా అభిమానులు రోజు రోజు కి పెరిగిపోతున్నారు.టాలీవుడ్ లో కి కూడా ప్రియా వారియర్ ను తీసుకు రావడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి.మన బన్నీ కూడా ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అయ్యి ఆమెకి ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసాడు.

ఈ సారి ఏకంగా తన కొడుకు తో ప్రియ వారియర్ గన్ సీన్ ని అనుకరిస్తూ వీడియో పెట్టాడు.వేళ్లకు ముద్దు పెట్టి.. గన్ ట్రిగ్గర్ మాదిరిగా చేతితో లాగి.. ముద్దుగా తుపాకీ పేల్చేసి తన కొడుకు ని కాల్చాడు .అల్లు అయాన్ కూడా గన్ తగిలిన వాడిలా బెడ్ మీద పడిపోయాడు.ఇక ఈ వీడియో వైరల్ అయింది.
ఈ వీడియో లో అయాన్ కూడా ఎంతో ముద్దు గా ఉన్నాడు .తండ్రి కొడుకుల ఈ సరదా వీడియో ని చూసి అల్లు వారి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు .

మైన‌ర్ బాలిక‌ను ముద్దుపెట్టుకోవ‌డం త‌ప్ప‌యితే క్ష‌మించండిః ప‌పొన్ బ‌హిరంగ లేఖ‌

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రియాల్టీ షోలో మైన‌ర్ బాలిక‌ను ముద్దుపెట్టుకోవ‌డంపై బాలీవుడ్ సింగ‌ర్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌పొన్ క్ష‌మాప‌ణ చెప్పాడు. దీనిపై బ‌హిరంగ లేఖ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. తానెలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్నాడు. ఓ చాన‌ల్ లో ప్ర‌సారమ‌వుతున్న ఇండియా కిడ్స్ రియాల్టీ షోకు పపొన్ మ‌హంత జ‌డ్జిగా వ్య‌వ‌హరిస్తున్నాడు. హోలీ కోసం రియాల్టీ షోలో స్పెష‌ల్ ఎపిసోడ్ చిత్రీక‌రించారు. ఇందులో భాగంగా పపొన్ 11 ఏళ్ల బాలిక ముఖానికి రంగులు పూసి పెదాల‌పై ముద్దుపెట్టుకున్నాడు. ఇది ఫేస్ బుక్ లైవ్ పేజీలో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కావ‌డంతో ప‌పొన్ తీరుపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. సుప్రీంకోర్టు న్యాయ‌వాది రునా భుయాన్ జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంఘంలో పపొన్ పై ఫిర్యాదుచేశారు.

ఈ నేప‌థ్యంలో ప‌పొన్ స్పందించాడు. ఏ విష‌యాన్న‌యినా ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేయ‌డం త‌న‌కు అల‌వాట‌ని, అలాగే తాను పాప‌కు ముద్దుపెట్టాను త‌ప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేద‌ని అన్నాడు. తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని న‌మ్ముతున్నాన‌ని, ఒక‌వేళ ముద్దుపెట్ట‌డం త‌ప్ప‌యితే మాత్రం త‌న‌ను క్ష‌మించాల‌ని కోరాడు. ఒక‌వేళ త‌న మ‌న‌సులో ఏద‌న్నా దురుద్దేశం ఉంటే ఆ వీడియోని ఫేస్ బుక్ లో ఎందుకు పెడ‌తాన‌ని ప్ర‌శ్నించాడు. 14 ఏళ్ల‌క్రితం పెళ్ల‌యిన త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నార‌ని, సోష‌ల్ మీడియా ద్వారా చేసే విమ‌ర్శ‌లు రెండు కుటుంబాల్లో చిచ్చుపెడ‌తాయని ఆందోళ‌న వ్య‌క్తంచేశాడు. ద‌య‌చేసి ఓ అమాయ‌క చిన్నారి జీవితాన్ని నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని బ‌హిరంగ‌లేఖ‌లో ప‌పొన్ కోరాడు. బాలిక తండ్రి కూడా దీనిపై స్పందించాడు. ప‌పొన్ ఎలాంటి త‌ప్పూ చేయ‌లేద‌ని, ఈ విష‌యంలో ప‌పొన్ ను త‌ప్పుగా అర్ధం చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌పడ్డాడు.

రియాల్టీ షో లైవ్ లో మైన‌ర్ బాలిక‌ను ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ సింగర్ …సోష‌ల్ మీడియా లో రచ్చ

0
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్ గాయకుడు, సంగీత‌ద‌ర్శ‌కుడు ప‌పోన్ అనుచిత‌వైఖ‌రిపై సోష‌ల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. న్యాయ‌నిర్ణేత హోదాలో ప‌పోన్ ఓ మైన‌ర్ బాలిక‌ను ముద్దుపెట్టుకోవ‌డం వివాదాస్ప‌ద‌మ‌యింది. ఓ చాన‌ల్ లో ప్ర‌సార‌మ‌వుతున్న ది వాయిస్ ఇండియా కిడ్స్ అనే రియాల్టీ షోకి ప‌పోన్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ షోకి ఆయ‌న‌తో పాటు గాయ‌కులు షాన్, హిమేశ్ రేష్మియాలు కూడా న్యాయ‌నిర్ణేత‌లుగా ఉన్నారు. మంగ‌ళ‌వారం ఈ షోలో హోలీ కోసం స్పెషల్ ఎపిసోడ్ చిత్రీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ప‌పోన్ హోలీ పాట రంగ్ బ‌ర్సేను ఆల‌పించారు. అనంత‌రం హోలీ ఆడుతూ ఓ మైన‌ర్  బాలిక ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమె  ముఖానికి రంగులుపూసి పెదాల‌పై ముద్దుపెట్టాడు. ఇది ఫేస్ బుక్ లైవ్ లో టెలికాస్ట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లుకొడుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు ప‌పోన్ తీరుపై మండిప‌డుతున్నారు. ప‌పోన్ ప్ర‌వ‌ర్త‌న‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు న్యాయ‌వాది రుణ భుయాన్ బాల‌ల హ‌క్కుల సంర‌క్ష‌ణ కింద పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు. ప‌పోన్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని రుణ భుయాన్ ఆరోపించారు.

ఓ మైన‌ర్ బాలిక‌తో ప‌పోన్ ప్ర‌వ‌ర్తించిన తీరు, ఆమెకు రంగులు పూసి త‌ప్పుగా ముద్దుపెట్టుకోవ‌డం త‌న‌ను షాక్ కు గురిచేసింద‌ని, రుణ భుయాన్ అన్నారు. ఈ వీడియో చూసిన త‌ర్వాత దేశంలోని రియాల్టీ షోల‌లో పాల్గొంటున్న మైన‌ర్ బాలికల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డాన‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. రియాల్టీ షోల‌లో బాలిక‌ల‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన తీరుపై సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరారు. అస్సామీ సింగ‌ర్ అయిన ప‌పోన్ అస‌లు పేరు అన్గ‌రాగ్ మ‌హంతా. బ‌ర్ఫీ, సుల్తాన్, ద‌మ్ లగా కే హైసా త‌దిత‌ర చిత్రాల్లో గాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందాడు.  

వైర‌ల్ గా మారిన రేణుదేశాయ్ క‌విత‌… పవన్ గురించేనా

0
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒక‌ప్పుడు మోడ‌ల్ గా,న‌టిగా… ప్ర‌స్తుతం ద‌ర్శ‌కురాలిగా, టీవీ షో జ‌డ్జిగా… ఇలా అనేక విభాగాల్లో త‌న ప్ర‌తిభాపాట‌వాలు చూపించినా…. రేణుదేశాయ్ ను అంద‌రూ గుర్తించేది సినీన‌టుడు, రాజ‌కీయ నేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌గానే. ప‌వ‌న్ తో విడిపోయి ఏడేళ్లు గ‌డిచినా… ఇప్ప‌టికీ ఆమె దేని గురించి మాట్లాడినా ప‌వ‌న్ తో ముడిపెడుతూనే చూస్తారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణుదేశాయ్ తాజాగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై కూడా ఇదే ర‌క‌మైన కామెంట్లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌న జీవితంలో పాతుకుపోయిన జ్ఞాప‌కాలు మ‌ళ్లీ గుర్తొచ్చాయంటూ కొంచెం బాధ‌, ఇంకొంచెం ఆవేద‌న క‌ల‌గ‌లిపి ఆమె రాసుకున్న ఓ క‌విత సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాలోని జ్ఞాప‌కాల‌న్నింటినీ వెలికితీశాను. ఆయ‌న మాట‌లు, ప‌దాలు, ఆయ‌న పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో నిక్షిప్త‌మ‌య్యాయి. కానీ క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయం. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ గుర్తుచేసింది. ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి అంటూ రేణు దేశాయ్ వీడియో సాగింది.

ఆమె ఎవ‌రిని ఉద్దేశించి ఈ వీడియో పోస్ట్ చేశారో తెలియ‌దు కానీ… వీడియో చూసిన ప‌వ‌న్ అభిమానులు మాత్రం ప‌వ‌న్ తో త‌న‌కున్న జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకుంటూ రేణు ఈ క‌విత రాసుకున్నార‌ని అంటున్నారు. చాలా బాగా చెప్పావు వ‌దినా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ క‌విత విష‌యం ప‌క్క‌న పెడితే రేణుదేశాయ్ ఇత‌ర ఏ విష‌యాల‌పై స్పందించినా… అది ప‌వ‌న్ గురించే అన్న అభిప్రాయంలో ఉంటారు ఆయ‌న అభిమానులు. నిజానికి ప‌వ‌న్ మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఆమెకు కొన్ని చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యేలా కూడా చేసింది. రెండో పెళ్లిపై ఆమె వ్య‌క్త‌ప‌రచిన అభిప్రాయాల‌ను చూసి ప‌వ‌న్ అభిమానులు కొంద‌రు ఆమెను తూల‌నాడుతూ కామెంట్లు చేయ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. తాజా క‌విత గ‌మ‌నిస్తే… తాను జ్ఞాప‌కాల్లా నిక్షిప్తం చేయాల‌నుకున్న విష‌యాలు ఇప్పుడు లేవ‌న్న అభిప్రాయాన్ని రేణుదేశాయ్ వ్య‌క్తంచేశారు. జ్ఞాప‌కాలు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన నా హృద‌యం, నేను రాసుకున్నలేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయ‌నడం ద్వారా పాత‌సంగ‌తుల‌న్నీ త‌న మ‌న‌సు పొర‌ల‌నుంచి తొల‌గిపోయాయంటున్నారు రేణుదేశాయ్.

భార్య సీక్రెట్ ఎఫైర్ చూసిన భర్త ఎక్కడైనా ఇలా చేస్తాడా ?

0
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

భార్యని సర్ఫరైజ్ చేద్దాం అని ఓ భర్త త్వరగా ఇంటికి వస్తాడు. తీరా ఆ సర్ఫరైజ్ అతనికే తగులుతుంది. ఆమె ఇంకోడితో బెడ్ మీద కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యం చూసిన ఏ భర్త అయినా ఆ ఇద్దరి మీదకు వెళ్ళిపోతాడు. కుదిరితే ఎవరో ఒకరిని చంపేస్తాడు. కానీ ఆ భర్త అలా చేయలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని భార్యని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. భార్యని బ్లాక్ మెయిల్ చేసే అతన్ని ఇంకొకరు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇదంతా నిజం కాదు. బాలీవుడ్ సినిమా బ్లాక్ మెయిల్ మూవీ సబ్జెక్టు. ఆ సినిమా ట్రైలర్ ఇప్పటికే రచ్చ రచ్చ చేసేస్తోంది. కాబాలంటే మీరు కూడా ఓ లుక్ వేయండి.

చీఫ్ విప్ కి జేసిదివాకర్ వార్నింగ్… వీడియో వైరల్

0
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏమి రఘు నీ పద్ధతి ఏమి బాగాలేదు, ఏమి మీరు చీఫ్ విప్, మంత్రులు అయినంత మాత్రాన మీరు ఏమైనా గొప్ప అనుకుంటున్నారా? నేను ఎవరి మాట వినని తెలుసు కదా? నేను ఇచ్చిన పనికి బిల్లు ఎందుకు అపినావ్, దూరంగా ఉన్నవాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలి అని చూసుకోవలె కానీ ఇంకా దూరం చేసుకోడం ఎంది? ని పద్ధతి ఏమి బాగాలేదు అబ్బా…

ఇది చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డికి ఫోన్ చేసి జేసి దివాకర్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్. ఈ వార్నింగ్ ని ఎవరో దొంగచాటుగా వీడియో తీసి నెట్లో పెట్టారు. ఇప్పుడు ఇది వైరల్ అయ్యి కూర్చుంది. పుట్టపర్తి లోని 10 లక్షల సిమెంట్ రోడ్డు విషయమై వీరిద్దరి మధ్యా ఈ గొడవ రాగా, ఓ పీఆర్ ఉద్యోగి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవడంతో టిడిపి నాయకులూ పోలీసులకి పిర్యాదు చేశారు