మీడియా తో రవితేజ… భరత్ మృతిపై?
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సోదరుడు భరత్ మృతి తర్వాత తొలిసారిగా నటుడు రవితేజ మీడియా ముందుకు వచ్చారు. లేనిపోనివి రాయొద్దంటూ మీడియాకి హితవు పలికారు. తమ్ముడిని కోల్పోయిన తమ బాధ గురించి ఆలోచించకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే ఎలా అని ఆవేదన చెందారు. అయితే ఓ మీడియా ప్రతినిధి జరిగినవి మాత్రమే రాశాం., కావాలంటే సాక్ష్యాలు చూపుతాం అని అనడంతో మధ్యలోనే రవితేజ వెళ్లిపోయారు. రాసిన విషయాన్ని తప్పుబడుతున్నారా లేక మీడియానే తప్పు బడుతున్నారా అని జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి రవితేజ ఇబ్బంది పడ్డారు. ఇంతకీ రవితేజ మీడియా తో ఏమి మాట్లాడారో మీరే చూడండి…
మరిన్ని వార్తలు
టాలీవుడ్ అమితాబ్..!
ప్లీజ్ బాలయ్య స్పందించండి
ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ చిరు నిర్మాతకి హ్యాండ్?
జగన్ పాదాభివందనం వెనుక …వైరల్ వీడియో
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద నాయకుల తోటే కటువుగా మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. సబ్బం హరి, రఘురామ కృష్ణంరాజు, మైసూరా రెడ్డి లాంటి వాళ్ళు ఆ తర్వాత టైం లో జగన్ వ్యవహారశైలిని బయటికి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ మొట్టమొదటిసారి ఓ బహిరంగంగా పాదాభివందనం చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. NDA తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంనాథ్ కోవిద్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు పార్క్ హయత్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వై.ఎస్ జగన్ తో పాటు ఆయన కి కుడి భుజం లాంటి విజయసాయి రెడ్డి కూడా కోవిద్ కి పాదాభివందనం చేశారు.
జగన్ వ్యవహారశైలి తెలిసిన వాళ్ళు ఈ పాదాభివందనం గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల చర్చ బయలుదేరినప్పటినుంచి బీజేపీ మనసు గెలవడానికి జగన్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు కూడా అదే టార్గెట్ తో జగన్ ఈ పాదాభివందనానికి రెడీ అయినట్టున్నారు. చేసిన తప్పులు, తరుముకొస్తున్న కేసులు గుర్తుకు వస్తుంటే ఎంతటివారైనా తల వంచక తప్పదని జగన్ పాదాభివందనంతో ఇంకోసారి రుజువైంది.
మరిన్ని వార్తలు
జగన్ చుట్టాల్లో ప్రశాంత్ కుంపటి?
చైనాతో యుద్ధం వస్తే పరిస్థితేంటి..?
బీజేపీ అంటే కేసీఆర్ కు భయమా..?
మీడియాపై ట్రంప్ అతి వీడియో
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పిచ్చి ముదిరింది. పైత్యం ప్రకోపించింది. ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ ట్రంప్ చేస్ పనులకి తక్కువే అవుతాయి. అసలు ట్రంప్ ను చూసి మెంటల్ ఆస్పత్రుల బదులుగా కొత్తగా ట్రంప్ ఆస్పత్రులు పెట్టాలని డాక్టర్లు సెటైర్లేస్తున్నారు. మీడియాపై కోపాన్ని ట్విటర్లో ప్రదర్శించిన ట్రంప్ పైత్యానికి సోషల్ మీడియా ఠారెత్తిపోతోంది. అసలు ట్రంప్ ఏం చేయాలనుకుంటున్నారో రిపబ్లికన్లకే అంతుబట్టడం లేదు.
అమెరికాలో ఫేమస్ ఛానెల్ సీఎన్ఎన్ ను క్లింటన్ న్యూస్ నెట్ వర్క్ గా గతంలో అభివర్ణించిన ట్రంప్… ఇప్పుడు ఏకంగా ఫ్రాడ్ న్యూస్ నెట్ వర్క్ అంటున్నారు. ట్విటర్లో డబ్లూడబ్లూడబ్లూ వీడియో పోస్ట్ చేసిన ట్రంప్… తాను పిడిగుద్దులు గుద్దుతున్న వ్యక్తి ముఖంపై సీఎన్ఎన్ లోగో అంటించి ట్విటర్లో వీడియో వదిలారు. ట్రంప్ అతి చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రపంచ చరిత్రలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా ట్రంప్ దిగజారి ప్రవర్తించారు. అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష స్థానానికి మాయని మచ్చ తీసుకొచ్చారు. వీడ్ని ఎందుకు ఎన్నుకున్నామురా భగవంతుడా అని అనుకోని అమెరికన్ లేడంటే అతిశయోక్తి కాదు. ట్రంప్ కు గర్వం తలకెక్కిందని, అధికారం పోయాకే ఆయన విషయం అర్థమౌతుందని సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని వార్తలు

