మా నాన్న మంచోడే.. అమ్మ వెనుక ఎవరో ఉన్నారు

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

prudhvi Raj Son Sai Srinivas Shocking Comments On Diverse Case

30 ఇయర్స్‌ పృథ్వీ ప్రస్తుతం యమ బిజీ కమెడియన్‌గా ఉన్నాడు. ప్రతి స్టార్‌ హీరో మరియు యువ హీరోలు కూడా పృథ్వీని తమ సినిమాల్లో కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే పథ్వీకి కుటుంబం నుండి సమస్యలు ఎదురవుతున్నాయి. దాదాపు 33 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న పృథ్వీకి ఇప్పుడు కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. కొన్నాళ్ల క్రితం భార్య నుండి విడిపోయిన పృథ్వీ, సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఈ సమయంలోనే ఆయన భార్య శ్రీలక్ష్మి తనను భర్త వేదిస్తున్నాడు, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు అంటూ విజయవాడ కోర్టులో ఫిర్యాదు చేసింది. తన భర్త నుండి నెలకు 10 లక్షలు భరణంగా ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది.

ఈ వివాదంపై పృథ్వీరాజ్‌ తనయుడు సాయి శ్రీనివాస్‌ స్పందించాడు. తన తండ్రి గురించి తల్లి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, చిన్నప్పటి నుండి కూడా ఆయన బాగానే చూసుకున్నారు. ఇటీవలే మా సోదరి వివాహాన్ని కూడా గ్రాండ్‌గా చేశారు. తన తల్లి వెనుక ఎవరో ఉండి ఆమెను ఇలా నడిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి అంటే పడని కొందరు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తన తండ్రి త్వరలోనే ఇండియాకు వచ్చి పూర్తి వివరాలను మీడియాకు చెప్తాడని సాయి శ్రీనివాస్‌ పేర్కొన్నాడు. పృథ్వీరాజ్‌ ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది కనుక ఇంతకు మించి మమ్ములను అడగవద్దని వీడియోను పోస్ట్‌ చేశాడు.

 

మరిన్ని వార్తలు:

తనయుడి కోసం భారీ ప్లాన్‌

‘జయదేవ్‌’పై మండిపడుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌

కెసిఆర్ ఆరోగ్యం గుట్టు విప్పిన మనవడు.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

CM KCR Grandson Himansh Show Entire Pragathi Bhavan Personal House

తెలంగాణ ఉద్యమ రోజుల నుంచి ఇప్పటిదాకా భాగ్యనగరం లో జరిగే పిచ్చాపాటీ కబుర్లలో తరచుగా వినిపించే టాపిక్ ఒకటుంది. అదే తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు ఆరోగ్యం. ఆయన ఆరోగ్యం అంత బాగా లేదటగా, త్వరలో కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారటగా అని కొందరు అనడం మిగతా వాళ్ళు తలో అభిప్రాయం చెప్పడం సర్వసాధారణంగా జరిగిపోతోంది. ఆ విషయంలో నిజం ఎంతో తెలియకపోయినా సాగుతున్న ప్రచారంతో కొందరిలో సందేహాలు ఏర్పడ్డ మాట నిజం. అయితే ఆ సందేహాల్ని పటాపంచలు చేసాడు కెసిఆర్ మనవడు హిమాంశు రావు.

ఇటీవల ముఖ్యమంత్రి నివాసంలో కెసిఆర్ మనవడు ఓ హిమాంశు ఓ వీడియో తీసాడు. ఆ వీడియోలో కెసిఆర్ తో పాటు ఆయనకి దగ్గరగా ఉండేవారిని, ఆయన వద్ద పనిచేసేవారిని కూడా హిమాంశు పరిచయం చేసాడు. ఆ వీడియోకి స్వయంగా హిమాంశు కామెంటరీ చేస్తూ తీసాడు. పైగా కెసిఆర్ కి చెప్పి మరీ ఆ వీడియో ని యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసాడు. అలా అప్ లోడ్ అయిన వీడియో చూసిన ఎవరికైనా కెసిఆర్ ఆరోగ్యం మీద వున్న సందేహాలు దూదిపింజల్లా ఎగిరిపోతాయి. ఆ వీడియోలో పాతికేళ్ల కుర్రవాడిలా చలాకీగా నడుస్తూ సరదాగా మనవడికి పంచ్ ఇవ్వబోయిన కెసిఆర్ ని అన్ని డౌట్స్ తీరిపోవడం ఖాయం.

మరిన్ని వార్తలు 

ఇండియా అన్న పదమే గిట్టని మాల్యా

జయదేవ్ ని చించిందెవరు?

కేశినేని దారి రహదారి

సంపాదించడమే కాదు ఇవ్వడమూ తెలిసిన చౌదరి గారు.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Natco Pharma CEO Donates 30 crores to guntur govt hospital

నాట్కో… దేశీయంగానే కాదు అంతర్జాతీయంగాను పేరెన్నికగన్న ఫార్మా రంగ సంస్థ. వివిధ జబ్బులకు ఔషధాలు కనిపెట్టడంలో ఆ సంస్థ సాధించిన విజయాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఆ సంస్థ పిలిస్తే ఓ ఉద్యోగి ముందుగా ఓ ఏడాది శాలరీ అకౌంట్ లో వేస్తే నాట్కోలో చేరే విషయం ఆలోచిస్తా అన్నారట. కానీ ఇప్పుడు ఆ సంస్థలో ఉద్యోగం దొరికితే చాలు జీవితం సెటిల్ అనుకునేవాళ్లు లక్షల్లో వున్నారు. ఇదీ ఓ సంస్థగా నాట్కో సంపాదించుకున్న విశ్వసనీయత. అలాంటి సంస్థ గొప్పదనం వెనుక వున్న ఛైర్మన్ నన్నపనేని వెంకయ్య చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంపాదించడంలో కిక్ తెలిసిన వాళ్లకి అనుభవించడంలో సంతోషం తెలియదు. ఇక ఇవ్వడంలో, సంపద పది మందికి పంచడంలో ఆనందం,తృప్తి గురించి అంతకన్నా తెలియదు. ఇలా సంపాదించడం, అనుభవించడం, ఇవ్వడం లో ఆనందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించిన వ్యక్తి నాట్కో చౌదరి.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సరైన కాన్సర్ హాస్పిటల్ లేక రోగులు ఎంతగానో ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పని చేయడానికి ముందుకు వచ్చింది మాత్రం నాట్కో చౌదరి గారే. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్సర్ చికిత్స విభాగం నెలకొల్పడానికి అక్షరాలా 30 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆయన. ఇందులో 16 .5 కోట్లు వైద్యపరమైన మౌలికసదుపాయాల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇక ఇటీవలే ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి 15 లక్షల నాట్కో షేర్లు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ దాదాపు 15 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. అయితే ఇదేదో కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగమని కొందరు పెదవి విరవచ్చు. కానీ నాట్కో చౌదరి గారు బయట ప్రపంచానికి తెలియకుండా చేసే సాయం ఎలా ఉంటుందో అక్కడ పని చేసే ఉద్యోగులకి బాగా తెలుసు. ఆ సంస్థలో పని చేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఆయన చేసిన సాయం వింటే సాటి సంస్థలు ఆయన మీద దండయాత్ర చేయడం ఖాయం. ఆ స్థాయిలో ఆ కుటుంబాల్ని ఆదుకున్నారు ఆయన. పోయిన మనిషి ఉన్నా ఇంతగా చూసుకోలేరేమో అన్నంతగా నాట్కో నుంచి అడక్కుండానే వస్తున్న పరిహారాలు చూసి ఆ కుటుంబాలు నోరెళ్లబెట్టిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. సంపాదించడంతో పాటు ఇవ్వడమూ తెలిసిన నాట్కో చౌదరి స్ఫూర్త్రిగా మరికొందరు ముందుకు వస్తే ఎన్నో ఇళ్లలో చీకట్లు తొలిగి వెలుగులు విరజిమ్ముతాయి. హాట్స్ ఆఫ్ చౌదరి గారు.

కత్తితో వస్తే కౌగిలించుకున్న పోలీస్: వైరల్ వీడియో

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Police Officer Calms Man With Knife By Hugging Him

ఎవరైనా వ్యక్తి కత్తితో బెదిరిస్తూ స్టేషన్ కి వస్తే ఏ పోలీస్ అయినా ఏమి చేస్తాడు ? అందుబాటులో వున్న తుపాకీతో కాల్చి పారేస్తాడు లేదా ఆ తుపాకీ చూపి భయపెట్టి ఆ కత్తిని లాగేసుకుంటాడు. కానీ థాయ్ లాండ్ కి చెందిన ఓ పోలీస్ అధికారి మాత్రం వచ్చిన వ్యక్తి మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుని మాటలతో అతను కత్తి అప్పగించేలా ఒప్పించాడు. అంతే గాకుండా ఆ ఒత్తిడి నుంచి బయటపడేయడానికి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ పోలీస్ అధికారి అనిరుత్ మాలీ.

థాయ్ లాండ్ లో రద్దీ ప్రాంతాల్లో సంగీత ప్రదర్శనతో ఒకతను పొట్టబోసుకునే వాడు. కొన్ని రోజుల కిందట ఎవరో ఆ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ కాజేశారు. దీంతో అతను పొట్టకూటి కోసం ఒకరి దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా పని చేసాడు. మూడు రోజులు పని చేయించుకున్నాక అతను జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో అతను తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. ఆ కుంగుబాటులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేతిలో కత్తి పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడి వారిని బెదిరించడానికి ట్రై చేసాడు. దీంతో ఓ పోలీస్ అతన్ని కాల్చబోగా అనిరుత్ వారిని వారించి మాటలతో అతని దగ్గరున్న కత్తిని తీసుకున్నాడు. ఓ కౌగిలింతతో అతన్ని ఓదార్చాడు. సీసీ టీవీ లో రికార్డు అయిన ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

గంగాళం కోసం వీధినపడ్డ విశాల్ వదిన.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

shreya reddy andava kaanom trailer

హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తమిళ్ లో ss మ్యూజిక్ ఛానల్ యాంకర్ గా, ఆ పై సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీయా ప్రముఖ నిర్మాత జి.కె. రెడ్డి తనయుడు, నటుడు విశాల్ సోదరుడు అయిన విక్రమ్ కృష్ణ ని 2008 లో పెళ్లాడారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శ్రీయా అలా ఎందుకు చేశారనని ప్రశ్నిస్తే తన భర్త పక్కా ఆంధ్ర రెడ్డి కుర్రోడు, ఆయనకి ఇష్టం లేదని కుండబద్దలు కొట్టేశారు. అయితే విశాల్ తనని నటించమని ప్రోత్సహించినట్టు కూడా చెప్పేసారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో కీలకమైన ట్విస్ట్ కూడా వుంది. శ్రీయ రెడ్డి మాజీ క్రికెట్ ప్లేయర్ భరత్ రెడ్డి కుమార్తె. దేశం తరపున కొన్ని మ్యాచ్ లు ఆడిన రంజీ ప్లేయర్ గా బాగా ఫేమస్. ఆయనకి కూడా కూతురు నటనలోకి వెళ్లడం పెద్దగా ఇష్టం లేదంటారు. ఏమైతేనేమి శ్రీయా నటిగా రాణించడమే కాకుండా ఓ సినిమా కుటుంబంలోకి అడుగు పెట్టింది.

తొమ్మిదేళ్ల తర్వాత ఆమె ‘అండవా కానోమ్’ అనే సినిమా చేసింది. పక్కా పల్లెటూరి పాత్రలో శ్రీయా ఈ సినిమాలో అదరగొట్టేసింది. ఓ గంగాళం కోసమే పెద్ద యుద్ధమే చేసింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక శ్రీయ నటన గురించి చెప్పనక్కర్లేదు. పల్లెటూరు పాత్రలో ఆమె విశ్వరూపం చూడొచ్చు అన్న రేంజ్ లో నటించేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్న నిర్మాతలు జాతీయ స్థాయి అవార్డు కూడా వస్తుందని ముందే ప్రకటనలు ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ మీద ఓ లుక్ వేయండి…

క్రైమ్ కన్నా సెక్స్ ఎక్కువైంది.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దండుపాళ్యం 2 సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. ఒకప్పుడు కర్ణాటకలో అరాచకం సృష్టించిన దండుపాళ్యం హంతక ముఠా కేంద్రంగా తీసిన తొలి భాగం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో రెండో భాగం కూడా మొదలెట్టారు. దండుపాళ్యం 2 లో క్రైమ్ కన్నా సెక్స్ ఎక్కువైనట్టయింది. చిత్ర యూనిట్ విడుదల చేసిన మేకింగ్ వీడియో చూస్తే ఆ స్టేట్ మెంట్ ఒప్పుకుని తీరాల్సిందే. జైల్లో ఓ లేడీ ఖైదీని ఏమి చేస్తుందో తెలిపే ఈ సన్నివేశం చూస్తే హవ్వ అనుకోక తప్పదు.

మరిన్నివార్తలు 

మహేష్‌తో సినిమా ఉంది

 

భరత్ జీవితం నేర్పిన పాఠం.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చివరిచూపులకి తల్లితండ్రులు కూడా రాని భరత్ జీవితాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. భరత్ మరణం గురించి రాగానే ఆయనకి మద్యం, డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ అలవాట్లు వల్ల ఇబ్బంది పడే వారి కుటుంబ సభ్యులు ఆయన చివరిచూపుకి కూడా రాలేదని ఎక్కువమంది వూహించుకుంటున్నారు. నిజానికి ఆ అన్నదమ్ముల్లో అందరికన్నా ముందు ఉండేవాడు భరత్. అన్న రవితేజ కన్నా ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమపెళ్లి. పైగా కులాంతర వివాహం. ఈయన క్షత్రియ అయితే, ఆమె కాపు. పైగా స్థితిమంతురాలు కూడా. ఆ ఇద్దరు కలిసి అమెరికాలో హాయిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు. కుటుంబ అవసరాలకి చేదోడువాదోడుగా వుండే వాళ్ళు. ఇలా సాగుతున్న వారి జీవితంలో చిచ్చు పెట్టింది మాత్రం నటన పిచ్చి.

ravi teja family

రవితేజ హీరో అయ్యాక కూడా భరత్ కుటుంబం హాయిగా అమెరికాలో ఉండేది. ఓ దర్శకుడు అమెరికా వెళ్ళినపుడు భరత్ ఆతిధ్యం స్వీకరించి బదులుగా ఏమీ ఇవ్వకుండా ‘ నువ్వు కూడా మీ అన్నలాగానే వున్నావు. ఇండియా వచ్చేయ్. హీరోని చేస్తా ‘ అని పొల్లుపోని డైలాగ్ ఒకటి చెప్పాడు. ఆ డైలాగ్ భరత్ జీవితానికి శాపమైంది. భరత్ లో నటించాలన్న పిచ్చి పెరిగింది. ఇంకేముంది, విమానం ఎక్కి కుటుంబంతో సహా ఇండియా వచ్చేసాడు. తీరా ఇక్కడికి వచ్చాక మాటలతో బూరెలు వండే ఆ దర్శకుడు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. రవితేజ మాట, సొంత ప్రయత్నాలతో అడపాదడపా చిన్నాచితకా పాత్రలు వచ్చినా భరత్ ఊహించుకున్న జీవితానికి, చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. దీంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి దాన్నుంచి తప్పించుకోడానికి దురలవాట్లకి దగ్గరయ్యాడు. ఫలితం ఏమిటో చూసాం. భరత్ ని ఈ పిచ్చి నుంచి తప్పించడానికి ఆయన భార్య విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. దీంతో ఆమె కూడా అమెరికా వెళ్ళిపోయింది. అన్న రవితేజ, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా భరత్ తాను వున్న స్థితి నుంచి బయటికి రాలేకపోయారు. చివరకు అర్ధాంతరంగా కన్నుమూసి కన్న వాళ్ళు కూడా చివరిచూపుకి రాలేని పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

ravi teja brother bharat family

ఓ దర్శకుడు కాలక్షేపం కోసం చేసిన పిచ్చాపాటీ కామెంట్ భరత్ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇలాంటి దర్శకులు సభ్య సమాజంలో చాలా మంది కనిపిస్తుంటారు. ఎదుటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి అలవికాని హామీలు ఇచ్చి, మాటలు చెప్పి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు, మర్చిపోయినట్టు వ్యవహరించడం. పైగా తన మాట పట్టుకుని ఎదుటివాడు ఇబ్బందిపడుతుంటే చూసి ఆనందించే శాడిజం వీరిది. దీనివల్ల వారి మనోవికారం బయటపడడం తప్పవారికి కూడా వేరే ఒరిగేదేమీ ఉండదు. ఆ దర్శకుడు టైం పాస్ మాటల ఖరీదు ఓ జీవితం. తామేదో స్పెషల్, పక్కనోడి జీవితం లైట్ అనుకునే ఇలాంటి వాళ్ళు నిజ జీవితంలో చాలా మంది కనిపిస్తారు. వీళ్ళ దరిద్రం ఏమిటంటే తనని నమ్మినవాడిని, తన మాట గౌరవించేవాడిని అమాయకులు అనుకోవడం. గౌరవం ఇచ్చేవాడి గొప్పదనం తప్ప తీసుకునే తనది కాదని గుర్తించకపోవడం.ఇక దర్శకుడు ఏమి చెప్పినా స్వీయ విశ్లేషణ లేకుండా తనకు ఏ మాత్రం పరిచయం, అవగాహన లేని పాత్రలో రాణించాలనుకోవడం భరత్ చేసిన పెద్ద తప్పు. ఒక్క భరత్ మాత్రమే కాదు ఇప్పుడున్న సమాజంలో చాలా మంది తమకు ప్రతిభ వుందో, లేదో చూసుకోకుండా పెద్దగా శ్రమ పడకుండా పెద్దోళ్ళు అయిపోయిన వారిలా బతకాలి అనుకోవడం భరత్ చేసిన ఇంకో తప్పు. ఇలా జీవితాన్ని ఫెయిల్యూర్ దిశగా తీసుకెళ్తున్న భరత్ లు ఎందరో. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం ఒకటుంది. ” జీవితమనేది అతి కష్టమైన, క్లిష్టమైన పరీక్ష. ఈ పరీక్షలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు . దీనికి కారణం వాళ్ళు పక్కనోళ్ళని చూసి కాపీ కొట్టడానికి ప్రయత్నించడమే. వాళ్లకి అర్ధం కాని విషయం ఏమిటంటే… ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ప్రశ్నపత్రం ఉంటుంది. దీన్ని గుర్తుంచుకుని ముందుకు వెళితే భరత్ లాగా జీవితానికి విషాద ముగింపులు వుండవు.

మరిన్నివార్తలు 

ఎన్టీఆర్ బెడ్ రూమ్ లో కెమెరాలు.

 

 

ఎన్టీఆర్ బెడ్ రూమ్ లో కెమెరాలు.

0

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్ మా టీవిలో బిగ్ బాస్ కి హోస్ట్ చేయబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. ఊహించని అనుభవం ఎదురైంది. ఓ రోజు తెల్లవారి లేచి చూసేసరికి బెడ్ రూమ్ నిండా కెమెరాలు కనిపించేసరికి ఎన్టీఆర్ ఉలిక్కి పడ్డాడు. మీరు మాత్రం ఎన్టీఆర్ కి ఏమైందో అని ఉలిక్కిపడకండే. ఇదంతా బిగ్ బాస్ ప్రమోషన్ కోసం తీసిన ఓ యాడ్ లో భాగం మాత్రమే.

తమిళనాడులో ఇదే కార్యక్రమాన్ని సీనియర్ నటుడు కమల్ హాసన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ షో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యింది ఒకటిరెండు ఎపిసోడ్లు మాత్రమే కావడంతో జనం నుంచి మిక్సెడ్ టాక్ వినిపిస్తోంది. ఆ ఫీడ్ బ్యాక్ ని కూడా దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి స్టార్ టీం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొద్దిసేపటి కిందట బిగ్ బాస్ ప్రోమో విడుదల చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు మీకోసం…