గంగాళం కోసం వీధినపడ్డ విశాల్ వదిన.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

shreya reddy andava kaanom trailer

హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తమిళ్ లో ss మ్యూజిక్ ఛానల్ యాంకర్ గా, ఆ పై సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రీయా ప్రముఖ నిర్మాత జి.కె. రెడ్డి తనయుడు, నటుడు విశాల్ సోదరుడు అయిన విక్రమ్ కృష్ణ ని 2008 లో పెళ్లాడారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శ్రీయా అలా ఎందుకు చేశారనని ప్రశ్నిస్తే తన భర్త పక్కా ఆంధ్ర రెడ్డి కుర్రోడు, ఆయనకి ఇష్టం లేదని కుండబద్దలు కొట్టేశారు. అయితే విశాల్ తనని నటించమని ప్రోత్సహించినట్టు కూడా చెప్పేసారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంకో కీలకమైన ట్విస్ట్ కూడా వుంది. శ్రీయ రెడ్డి మాజీ క్రికెట్ ప్లేయర్ భరత్ రెడ్డి కుమార్తె. దేశం తరపున కొన్ని మ్యాచ్ లు ఆడిన రంజీ ప్లేయర్ గా బాగా ఫేమస్. ఆయనకి కూడా కూతురు నటనలోకి వెళ్లడం పెద్దగా ఇష్టం లేదంటారు. ఏమైతేనేమి శ్రీయా నటిగా రాణించడమే కాకుండా ఓ సినిమా కుటుంబంలోకి అడుగు పెట్టింది.

తొమ్మిదేళ్ల తర్వాత ఆమె ‘అండవా కానోమ్’ అనే సినిమా చేసింది. పక్కా పల్లెటూరి పాత్రలో శ్రీయా ఈ సినిమాలో అదరగొట్టేసింది. ఓ గంగాళం కోసమే పెద్ద యుద్ధమే చేసింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక శ్రీయ నటన గురించి చెప్పనక్కర్లేదు. పల్లెటూరు పాత్రలో ఆమె విశ్వరూపం చూడొచ్చు అన్న రేంజ్ లో నటించేసింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్న నిర్మాతలు జాతీయ స్థాయి అవార్డు కూడా వస్తుందని ముందే ప్రకటనలు ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ మీద ఓ లుక్ వేయండి…