ఛీ పాడు… విమానంలో అందరి ముందు సెక్స్.
నలుగురు నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న ధోరణిలో వ్యవహరించింది ఓ జంట. ఏకాంతం లో చేయాల్సిన శృంగారాన్ని సిగ్గుఎగ్గు లేకుండా తోటి ప్రయాణికుల ముందే చేసింది. సరే వాళ్ళు ఇద్దరు ప్రేమికుల్లో, దంపతులో అనుకుంటే అదీ కాదు. అందరు చూస్తుండగానే కామం తో వ్యవహరించిన అతగాడు ఇంకో అమ్మాయితో ఆరేళ్లుగా ప్రేమలో వున్నాడంట. ఇప్పుడు ఆమె గర్భవతి కూడా. త్వరలోనే ఆమెని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఆ టైం లో ఓ ప్రయాణంలో ఇంతకి బరి తెగించాడు. వేరే అమ్మాయితో శృంగారం చేస్తున్న ఈ వీడియో బయటికి రావడంతో ఆ ప్రియురాలు పెళ్ళికి ఒప్పుకుంటుందా, లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది.
ఐరిష్ కి చెందిన విమానం మాంచెస్టర్ నుంచి ఇబిజా వెళ్తుండగా ప్రయాణికులు ఆశ్చర్యపడేలా షాన్ అనే వ్యక్తి తాను కూర్చున్న సీట్ లోనే ఓ అమ్మాయితో ఆ పని కానిచ్చాడు. ఈ దృశ్యం చూడలేక సాటి ప్రయాణికులు కొందరు సిగ్గుతో తలదించుకుంటే, ఇంకొందరు వాళ్ళు చేసే పనిని షూట్ చేసి నెట్ లో పెట్టారు. షాన్ తో రెచ్చిపోయిన అమ్మాయి తాము చేసింది సెక్స్ కాదని బుకాయిస్తోంది. అది ఓ రకం డాన్స్ మాత్రమే అంటోంది. ఇప్పుడు సదరు విమానయాన సంస్థ మాత్రం ఈ జంట మీద చర్యకు సిద్ధపడుతోంది.
Watch this horny couple have sex on flight from Manchester to Ibiza 😱😱😱
Posted by Social Spy NG on Saturday, June 10, 2017
అమరావతి కి చిల్లు పడిందా?
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రుల సరికొత్త రాజధాని అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతున్న మాట.అయితే ఈసారి తొలకరి వానలు ముందుగానే ఏపీని పలకరించాయన్న సంతోషం సీఎం చంద్రబాబుకి లేకుండా చేసింది అమరావతిలో తాత్కాలిక రాజధాని భవన నిర్మాణం.కుంభ వృష్టిగా కురిసిన వానతో రాజధాని లోని అసెంబ్లీ సహా ఇతర భవనాల్లో వాన నీళ్లు రావడం,నిర్మాణాల పెచ్చులు ఊడటం చూసి కట్టడపు నాణ్యత మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.సాక్షి చెబుతున్న దాని ప్రకారం ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ నీటిమయం అయ్యింది.బకెట్స్ తో ఆ నీటిని తోడిపోస్తున్న దృశ్యాల్ని సాక్షి ప్రసారం చేస్తోంది.
సమస్య చిన్నదైతే దాన్ని పెద్దగా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.ఆ వాదనకు బలం చేకూరే ఘటనలు ఏమీ కనిపించడం లేదు.ఈ ఉదయం నుంచి అసెంబ్లీ ప్రాంగణం లోకి వెళ్లేందుకు వైసీపీ బృందం,విలేకరులని వెంటబెట్టుకుని వెళ్ళింది.కానీ అసెంబ్లీ భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు ధర్నాకి దిగారు.పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.వైసీపీ ఆరోపిస్తున్నట్టు తాత్కాలిక భవనాల ప్రమాణాలు నాసిరకంగా ఉంటే ఈరోజు కాకపోయినా ఇంకోరోజు బయటపడతాయి.అసలు అసెంబ్లీ జరిగే రోజుల్లోనే భారీ వర్షం పడితే ఈ తంతు చూడకుండా ఎవరినీ ఆపలేరు.ఇప్పటిదాకా టీడీపీ సర్కార్ మీద ఎన్ని విమర్శలు వస్తున్నా అమరావతి,అభివృద్ధి అనే అస్త్రాలతో ప్రభుత్వం నెట్టకొస్తోంది.ఇవే పరిణామాలు పునరావృతమైతే ఆ అస్త్రం టీడీపీ చేజారినట్టే.అమరావతికి చిల్లు పడినట్టే.



