విజయ్‌ జర జాగ్రత్త..!

vijay devarakonda Ye Mantram Vesave Movie Get negative talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాలతో ఒక్కసారిగా సూపర్‌ స్టార్‌ అయిపోయిన విజయ్‌ దేవరకొండ నేడు ‘ఏ మంత్రం వేసావె’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక స్థాయి ఇమేజ్‌ వచ్చాక ఆ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు మూడు సినిమాలతో వచ్చిన క్రేజ్‌ కేవలం ఒక్క ఫ్లాప్‌తో పోయే అవకాశం ఉంటుంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ్‌ తాజాగా ‘ఏ మంత్రం వేసావె’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం విజయ్‌కి తీవ్ర నిరాశను కలిగించింది.

‘అర్జున్‌ రెడ్డి’ వంటి యూత్‌ ఫుల్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ నుండి అంతా కూడా అదే స్థాయి సినిమాను ఆశించారు. కాని తాజాగా వచ్చిన ఏ మంత్రం వేసావె చిత్రం చాలా సాదా సీదాగా, రొటీన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో ప్రేక్షకులు తీవ్ర నిర్సుహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్‌ రెడ్డి హీరో ఇలా చెత్త సినిమా చేయడం ఏంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం విజయ్‌కి ఆ చిత్రం గాలివాటు విజయం అని, అసు స్థాయి ఆయనది ఇదే అంటూ ఎద్దేవ చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ ఈ చిత్రం వల్ల చాలా నష్టపోయాడు అని చెప్పుకోవచ్చు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయినా సక్సెస్‌ కాకుంటే ఇక కెరీర్‌ మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉందని విమర్శకులు చెబుతున్నారు.