చంద్రబాబుపై విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి

చంద్రబాబుపై విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి

ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలవడం తో తమ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ పై తమ విమర్శలలో ఘాటును మరింత పెంచారు.అయితే టీడీపీకు వైసీపీ ను ఎండగట్టడానికి దొరికే ఏ చిన్న పాయింట్ ను కూడా వదలడం లేదు.అలా తెలుగుదేశం పార్టీ నేతలు సహా ఆ పార్టీ అధ్యక్షుడే నేరుగా రంగంలోకి దిగి వైసీపీ చేస్తున్న అక్రమాలను మరియు జగన్ ను ఉద్దేశించి గట్టిగానే విమర్శిస్తున్నారు.అయితే వీరి విమర్శలకు అనుగుణంగా వైసీపీ నుంచి అయితే ఒకే ఒక్క నేత అందరికీ కలిపి తిరిగి ఇచ్చేస్తారు.

అతనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే విజయసాయి రెడ్డి చంద్రబాబుపై మరింత స్థాయిలో విరుచుకుపడుతున్నారు.దీనితో టీడీపీ శ్రేణులు మరోసారి పాయింట్స్ తో కొడుతున్నారు.చంద్రబాబు ఏమన్నా అంటే అంతెత్తున ఎగసి పడి పేరాలు పేరాలు ట్వీట్లు వేసే మీకు ఇటీవలే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రాకు తీరని అన్యాయం చేస్తే ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు ఎందుకు?దమ్ముంటే బీజేపీను ఎదిరించి ఒక్క ట్వీట్ వెయ్యమని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు విజయసాయి రెడ్డిపై ప్రశ్నలు సంధిస్తున్నారు.ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనని విజయసాయి రెడ్డి ఇప్పుడు మాత్రం అనే సూచనలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పాలి.