సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విజ‌య నిర్మ‌ల విగ్ర‌హావిష్క‌ర‌ణ

సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో విజ‌య నిర్మ‌ల విగ్ర‌హావిష్క‌ర‌ణ

ఈనెల 20న దివంగ‌త ద‌ర్శ‌కురాలు విజ‌య నిర్మ‌ల జ‌యంతి. ఈ సంద‌ర్భంగా విజ‌య నిర్మ‌ల విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయ‌బోతున్నారు. నాన‌క్‌రామ్ గూడ‌లో కృష్ణ నివాసంలోనే ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. గురువారం మ‌హేష్ బాబు చేతుల మీదుగా ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా ఎన్నో మ‌ర‌పు రాని చిత్రాల్ని అందించారు విజ‌య నిర్మ‌ల‌. గ‌తేడాదే అనారోగ్యంతో క‌న్నుమూశారు. విజ‌య‌నిర్మ‌ల లేక‌పోవ‌డంతో ఒంట‌రి అయిపోయారు కృష్ణ‌. ఇప్పుడు నాన‌క్ రామ్ గూడాలోనే ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతున్నారు. కృష్ణ కోరిక మేర‌కే ఈ విగ్ర‌హాన్ని అక్క‌డ ప్ర‌తిష్టించారు. ఈ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కృష్ణ‌, న‌రేష్‌, మ‌హేష్‌ల‌తో పాటు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌, పార్ల‌మెంటు స‌భ్యుడు సంతోష్ త‌దిత‌రులు పాల్గొన‌బోతున్నారు.