చంద్రబాబు నాయుడుపై విజయసాయి రెడ్డి సంచలనమైన వాఖ్యలు

చంద్రబాబు నాయుడుపై విజయసాయి రెడ్డి సంచలనమైన వాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. నిత్యం ప్రతిపక్షాలు చేసే అనవసరమైన తప్పుడు ఆరోపణలకు బుద్ది చెప్పడానికని ఎంపీ విజయసాయి రెడ్డి సిద్ధంగా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. కాగా ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన వాఖ్యలను తప్పుబట్టిన విజయసాయి రెడ్డి మంగళవారం నాడు సామజిక మాంద్యమాల ద్వారా చంద్రబాబు ని టార్గెట్ చేసి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ”రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని చంద్రబాబు స్కెచ్ వేశాడు. అలా జరిగి ఉంటే వాటి విలువ 6-7 లక్షల కోట్లకు చేరేది. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారు”… అని వాఖ్యానించారు.

అయితే ఈ ఎంపీ వాఖ్యలపై పలువురు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతూ, చంద్రబాబు ని తప్పుబడుతున్నారు. కాగ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ కూడా సీఎం జగన్ కి ఎలాంటి సమస్య రాదనీ, ఎందుకంటే వారి బెదిరింపులకు బయపడటానికి అక్కడున్నది టీడీపీ నేత కాదని, సింహం లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వాఖ్యానించారు. ఇకపోతే రాష్ట్రాన్నిచక్కదిద్దెందుకే అభివృద్ది & అధికార వికేంద్రీకరణ పద్దతి ప్రవేశపెట్టారని, ప్రతిపక్ష నేతలు ఎంతలా పై ఎత్తులు వేసినప్పటికీ కూడా సీఎం జగన్ అసలే వెనకడుగు వేయరని పలువురు నెటిజన్లు వెల్లడించారు.