జగన్ మళ్ళీ జైలుకే అంటున్న టీడీపీ నేతలు

జగన్ మళ్ళీ జైలుకే అంటున్న టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కొన్ని సంచలన వాఖ్యలు చేశారు. ఒకవేళ విశాఖ భూ కుంభకోణం పై గనక సీబీఐ విచారణ జరిగితే మాత్రం సీఎం జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని తెదేపా సీనియర్‌నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వాఖ్యలు చేశారు. కాగా విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి టీడీపీ నేత ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ… గత ఏడు నెలలుగా విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

కాగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పా ర్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అక్రమాలను అన్నింటిని కూడా బయటకు తెస్తామని ఆరోపించారు. ఇకపోతే ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నేతలు అందరు కూడా రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, కేవలం వారి స్వలాభం కోసమే రాజధానిని అమరావతి నుండి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇకపోతే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఇక రాజధాని అమరావతిలోనే ప్రజారాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు.