చరణ్‌ తర్వాత స్థానంలో విజయ్‌…!

VijayDevarakonda Is Next To RamCharan

ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన చిత్రాలు అన్ని కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతూ వచ్చాయి. సమ్మర్‌లో ‘రంగస్థలం’ చిత్రంతో సందడి మొదలైంది. దాదాపు 125 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ను దక్కించుకున్న రంగస్థలం ఈ సంవత్సరపు టాప్‌ చిత్రంగా నిలిచింది. ఈ సంవత్సరంలో మరో మూడు నెలలు ఉన్నాయి. అయినా కూడా రంగస్థలంను మించగల సత్తా రాకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఈ ఏడాది నిర్మాతకు అత్యధికంగా వసూళ్లను తెచ్చి పెట్టిన చిత్రంగా రంగస్థలం నిలిచ్చింది. ఆ తర్వాత స్థానంలో గీత గోవిందం నిలిచింది.

ram-charan

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గీత గోవిందం చిత్రం భారీ వసూళ్లను సాధించిన విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంతో ఏకంగా 50 కోట్ల లాభాలను నిర్మాతకు తెచ్చి పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున వసూళ్లు సాధించడంతో పాటు ఒక ట్రెండ్‌ సెట్‌ చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ ఎత్తున వసూళ్లు సాధించిన ఈ రెండు చిత్రాలు నిర్మాతలకు లాభాలను దక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రెండు చిత్రాల తర్వాత మహానటి చిత్రం నిలిచింది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం నిర్మాత అశ్వినీదత్‌కు కాసుల పంట పండిచ్చినట్లుగా ట్రేడ్‌వర్గాల వారు అంటున్నారు.

ram-charam-vijay