రెండు భాగాలుగా “వ్యూహం” సినిమా రిలీజ్ .!

టాలీవుడ్ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ టైం లో అయితే ఎక్కువ పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా తాను అనౌన్స్ చేసి మంచి సెన్సేషన్ రేపిన రీసెంట్ సినిమా నే “వ్యూహం”. ఏపీకి సంబంధించి గడిచిన ఎన్నికలు అంతకు ముందు కొన్ని రసవత్తర పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమానే ఇది కాగా వర్మ అయితే లేటెస్ట్ గా దీనికి సీక్వెల్ ని కూడా ప్రకటించాడు.

రెండు భాగాలుగా “వ్యూహం” సినిమా  రిలీజ్ .!
vyuham, Shapadam

అయితే ఈ రెండో పార్ట్ కి “శపథం” అనే టైటిల్ ని లాక్ చేయగా మొదటి భాగాన్ని అయితే ఈ నవంబర్ 10న విడుదల చేస్తుండగా రెండో సినిమా ని మాత్రం వచ్చే ఏడాది జనవరి 20 న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ రెండు సినిమా లు కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేస్తాయో లేదో అనేది చూడాలి. ఇక ఈ సినిమా కి దాసరి కిరణ్ కుమార్ రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నారు.