భర్తను మర్మాంగాల పై దాడి చేసి చేసి చంపిన భార్య !

Wife Kills Husband For Illicit Affair

వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలను తీస్తూనే ఉన్నాయి. ఆ సంబంధానికి అలవాటు పడిన భార్యల చేతిలో మృత్యువాత పడుతున్న భర్తల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటన వెలుగుచూసింది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక మహిళ భర్తను చంపేసింది. స్థానికంగా సంచలనం రేపుతున్న ఈ సంఘటన అనంతపూర్ జిల్లాలోని ఓడీ చెరువులో జరిగింది.

ఓడీ చెరువుకు చెందిన 35 ఏళ్ల పెద్ద ఆదెప్ప భార్య రమ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. భర్త వ్యసనాన్ని ఆసరాగా చేసుకున్న రమ్య అదే గ్రామానకి చెందిన మంజునాథ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఆదెప్ప భార్యను నిలదీశాడు.ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. అయినా పద్దతి మార్చుకోని రమ్య ప్రియుడితో కలిసి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని పథకం పన్నింది. పథకం ప్రకారం ఆదెప్పకు స్నేహితుడైన చరణ్ సాయం కోరారు. చరణ్, ఆదెప్పను మండలకేంద్రంలోని చెరువులోకి పిలుచుకెళ్లాడు. అక్కడ ఆదెప్పకు పుల్లుగా మద్యం తాగించాడు. మత్తుగా తాగి పడిపోయిన తర్వాత అక్కడికి చేరుకున్న రమ్య, మంజునాథ్ ఆదెప్పపై దాడి చేసి చంపేశాడు. మంజునాథ్ గొంతు నులిమగా, భార్య రమ్య అత్యంత దారుణంగా భర్త మర్మాంగాలపై దాడి చేసి చేసీ చంపేసింది. ఆదెప్ప చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.