క‌డ‌ప‌లో మ‌రో స్వాతిః ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త‌మార్చిన భార్య‌

wife-kills-husband-lover-he

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగ‌ర్ క‌ర్నూల్ లో స్వాతి ఉదంతం వెలుగుచూసిన త‌ర్వాత ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా క‌డ‌ప జిల్లాలో స్వాతి త‌ర‌హాలో ఓ మహిళ భ‌ర్త‌ను చంపించిన దారుణం వెలుగుచూసింది. పుల్లంపేట మండ‌లం చ‌వ‌న‌వారిప‌ల్లెకు చెందిన శివ‌, అరుణ‌కు నాలుగేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే అరుణకు పెళ్లికి ముందు నుంచీ సాయి సుభాష్ అనే వ్య‌క్తితో ప్రేమ‌వ్య‌వహారం ఉంది. పెళ్లైన త‌ర్వాత కూడా అరుణ ఆ సంబంధాన్ని కొన‌సాగిస్తుండ‌డం శివ దృష్టికి వ‌చ్చింది. ప‌లుమార్లు శివ ఈ విష‌య‌మై భార్య‌ను హెచ్చ‌రించాడు. దీంతో అరుణ భ‌ర్త అడ్డు తొల‌గించుకోవాల‌ని నిర్ణ‌యించింది.

ప్రియుడు సాయిసుభాష్ తో క‌లిసి భ‌ర్త హత్యకు ప‌థ‌కం వేసింది. ఈ మేర‌కు సుభాష్ పార్టీ పేరుతో శివ‌, అరుణ‌ల‌ను ఓ తోట‌కు తీసుకెళ్లాడు. త‌న వెంట మ‌రో ఇద్ద‌రు మిత్రుల‌ను కూడా తెచ్చుకున్నాడు. వారందరూ క‌లిసి శివ‌కు మ‌ద్యం తాగించి విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌త్తుల‌తో పొడిచి హ‌త‌మార్చారు. అనంత‌రం మృత‌దేహాన్ని పుల్లంపేట మండ‌లం అన్న‌స‌ముద్రం అట‌వీప్రాంతంలో ప‌డేశారు. శివ క‌నిపించ‌క‌పోవ‌డంతో మృతుడి కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు. పోలీసులు సాయిసుభాష్‌, అరుణ‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.