పెళ్లాల తికమక: మత్తులో.. నాల్గో పెళ్లాంతో కలిసి మూడో పెళ్లాం ఇంటికి..

సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య

మధ్యప్రదేశ్ లో ఓ ఘోరం జరిగిపోయింది. మద్యం మత్తులో ఆదమరచిన ఓ మందుబాబు నాలుగో పెళ్లాంతో కలిసి మూడో పెళ్లాం ఇంటికి వెళ్లిపోయాడు. ఇంకేముంది.. ఒకటే గొడవ.. ఆ తర్వాత హత్య. అసలేం జరిగింది అంటే.. ఒక్క భార్యతోనే ఏగలేక భర్తలు భార్యా బాధిత సంఘాలు పెట్టుకుంటుంటే.. తనకేం భయం లేదు అన్నట్లు ఓ యువకుడు ఏకంగా నాలుగు కాపురాలు పెట్టేశాడు. అదెలాగంటే.. మొదట ఒక భార్య చనిపోగానే.. తర్వాత ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య చనిపోగా మిగిలిన ముగ్గురు భార్యలతో ఒకరికి తెలీకుండా మరొకరితో కాపురం చేస్తున్నాడు. ముగ్గురినీ వేర్వేరు ఊళ్లలో ఉంచి మరీ మనోడు మేనేజ్ చేస్తున్నాడు. అయితే ఓ రోజు మద్యం మత్తులో అతను చేసిన పొరపాటు అతని జీవితానికి ఎండ్ కార్డ్ పడింది.

మధ్యప్రదేశ్‌ లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గొటెగావ్ తెహ్సిల్ ప్రాంతానికి చెందిన హేమ్‌రాజ్‌ కి నలుగురు భార్యలు. తొలి భార్య చనిపోగా మిగిలిన ముగ్గురు భార్యలతో మరొకరితో కాపురం చేస్తున్నాడు. రెండో భార్య నర్సింగ్‌పూర్‌ లో, మూడో భార్య బగాస్‌పూర్ లో నాలుగో భార్య కరేలీలో ఇలా వరుసగా కాపురాలు పెట్టేశాడు. అయితే స్వతహాగా మందుబాబు అయిన హేమ్‌ రాజ్  తాజాగా తనతో ఉన్నది మూడవ భార్య అనే విషయం మర్చిపోయి.. నాలుగవ భార్య ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే భర్త ఎక్కడికన్నా కొత్త చోటుకు తీసుకు వెళ్తున్నాడెమో అని ఆమె చాలా సైలెంట్ గానే ఉంది. తీరా నాలుగో భార్య ఇంటికి వెళ్లి చూస్తే మనోడికి జరిగిన విషయం అర్ధమైంది. అక్కడ ఇక సవతుల పోట్లాట.
ఇంటికొచ్చిన భర్తను చూసి తీవ్ర ఆగ్రహం చెందిన నాలుగో భార్య అతనితో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్రాతి తీవ్రమైన గొడవ చోటుచేసుకుంది. దీంతో హేమ్‌రాజ్‌ మాటకు మాటా పెరిగి చేయిచేసుకున్నాడు. అందుకు ఆమె సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆరోజుకి పడుకోంది. మరుసటి రోజు తెల్లవారుజామున వచ్చి చూసేసరికి భర్త ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించాడు. అంతేకాకుండా మూడో భార్య కనిపించకుండా పోయినట్లు నాలుగో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు ఈ లెక్కేంటబ్బా అంటూ దర్యాప్తు జరుపుతున్నారు.