ధోనీ పై దాదా సంచలన నిర్ణయం

ధోనీ పై దాదా సంచలన నిర్ణయం

ఈనెల 24న టీ20 సిరీస్‌ భారత్ బంగ్లాదేశ్‌కి జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ సెలక్టర్లతో మాట్లాడబోనున్నారు. వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ గురించి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నెల 24న బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న మాజీ కెప్టెన్  గంగూలీ ధోనీ తో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది.

ఈ నెల 24న సెలక్టర్లని అడిగి తెలుసుకుని తన అభిప్రాయం కూడా వారికి తెలియచేస్తా అని గంగూలీ వెల్లడించాడు. అలాగే ధోనీతో కూడా మాట్లాడి తన అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీస్కుని ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే ధోనీకి వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశాన్ని కల్పిస్తాననే సౌరవ్ గంగూలీ తెలిపారు.

టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ నవంబరు 3నుంచి ఆడనుంది. భారత సెలక్టర్లు ఈ నెల 24న జట్టుని ఈసిరీస్ కోసం ఎంపిక చేయబోతున్నారు.ఈలోపు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న గంగూలీ ధోనీ గురించి సెలక్టర్లతో మాట్లాడతానని తెలిపాడు.