నగరంలో కలకలం…హైదరాబాద్ నడిబొడ్డున యువతి ఆత్మహత్య

Young woman committed suicide at madhapur

నగరంలో విషాదం చోటు చేసుకుంది. మాదాపూర్‌లోని మిలాంజ్‌ టవర్‌పై నుంచి దూకి ఈరోజు ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. యువతి అదే భవనంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న శ్రావణి( 27)గా గుర్తించారు. ఈరోజు ఉదయం ఆఫీస్‌కు వచ్చిన శ్రావణి, తొమ్మిదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. కాగా ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రావణి గత కొన్ని రోజులుగా తీవ్రమైన మనోవేదనకు గురి అవుతోందని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. యువతి ఆత్మహత్యతో స్థానికంగా కలకలం రేగింది.

Young Woman Commits Suicide In Madhapur - Sakshi