మరో టికెట్ ఖరారు చేసిన జగన్…!

YS Jagan Mohan Reddy Announced Another Candidate

ఎలా అయిన సీఎం పదవి సాదించాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ మరో నియోజకవర్గం అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డి వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించారు జగన్. ఈ నియోజకవర్గంలో పార్టీ ఇన్ చార్జిగా ఉంటున్న కొలగట్ల వీరభద్రస్వామినే జగన్ అభ్యర్థిగా ఖరారు చేశారు.

jagan-padha-yatra
ఆయనను ఈ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను అని, గెలిపించాలని విజయనగరంలో జరిగిన సభలో జగన్ కోరారు. ‘వీరభద్రస్వామి మంచివారు, సౌమ్యుడు.. ఆయన మంచి చేస్తారనే నమ్మకం నాకుంది.. మీ అందరి చల్లని దీవెనలు ఆయనపై, పార్టీపై , నా పై ఉండాలని కోరుతున్నానని జగన్ వీరభద్రస్వామి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 2004 నుంచి వరసగా పోటీ చేస్తూ వస్తున్నారు వీరభద్రస్వామి. 2004లో ఆయన చివరిగా నెగ్గారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ మధ్య జిల్లా అధ్యక్ష్యుడిగా ఉన్న ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి.

kolla-gattla