Election Updates: మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉంది: వైయస్ జగన్

Election Updates: We have God's grace, people's blessing: YS Jagan
Election Updates: We have God's grace, people's blessing: YS Jagan

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఈనెల 13న రాత్రి రాయితో దాడి చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. దీంతో ఏప్రిల్ 14న జగన్ మేమంతా సిద్ధం సభ వాయిదా పడింది. సీఎం జగన్ కి కనుబొమ్మ, నుదిటి పై గాయం కావడంతో రెండు కుట్లు వేశారు వైద్యులు. ఇవాళ మళ్లీ మేమంతా సిద్ధం సభ కొనసాగుతోంది.

ముఖ్యంగా వైసీపీ నేతలకు సీఎం జగన్ ధైర్యం చెప్పారు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. ధైర్యంగా ముందుకు అడుగు వేద్దామని సూచించారు. ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తాజాగా సీఎం జగన్ బస్సు యాత్ర గన్నవరంకి చేరుకుంది. అడుగడుగునా హారతులు, పూలతో స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల ప్రజలతో గన్నవరం రహదారులు కిక్కిరిసిపోయాయి.