‘కాంతార’ నిర్మాతలకు షాక్ ఇచ్చిన కేరళ హైకోర్టు..

‘కాంతార’ నిర్మాతలకు షాక్
‘కాంతార’ నిర్మాతలకు షాక్ ఇచ్చిన కేరళ హైకోర్టు

కర్ణాటకలోని సంప్రదాయం నేపథ్యంలో గత ఏడాది రూపొందిన చిత్రం ‘కాంతార’. హోంబ‌లే ఫిలింస్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. రిష‌బ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ ఇందులో థానే హీరో గా నటించారు. 16 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో చిత్రించిన ఈ చిత్రం దాదాపు 450 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను రాబట్టుకుంది.

కిందటి ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డుల‌ను బద్దలు చేసిన చిత్రాల్లో కాంతార కూడా ఒక‌టి. గ్రామ ప్ర‌జ‌ల‌ను ఊరి పెద్ద‌గా ఉండే వ్య‌క్తిగా త‌రిమేయాల‌నుకుంటాడు. అప్పుడు వారేం చేస్తార‌నేదే సినిమా. సింపుల్ క‌థే అయినా రిష‌బ్ శెట్టి న‌ట‌న అంద‌రినీ దృష్టిని ఆక‌ట్టుకుంది. వ‌రాహ రూపం పాట ఈ సినిమాలో ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నది.

అయితే త‌మ పాట‌ను కాంతార మేక‌ర్స్ కాపీ కొట్టారంటూ కేర‌ళ‌కు చెందిన తాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోప‌ణ‌లు వివాదానికి దారి తీసిన విషయం అందరికి తెలిసిందే. న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. విచార‌ణ చేసిన కేర‌ళ హైకోర్టు ‘కాంతార’ మేక‌ర్స్‌కి ఒక షాకిచ్చింది. ఈ సాంగ్‌ను థియేట‌ర్స్‌లో, డిజిటల్ మాధ్య‌మాల్లో తొలగించాలనంటూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

వరాహ రూపం పాట ప్రాథ‌మిక కాపీ రైట్స్ చ‌ట్టాన్ని ఉల్లంఘించింద‌ని కోర్టు చిత్ర యూనిట్ కు తెలియ‌జేసింది. కేసుకి సంబంధించిన ఆధారాల‌ను మే 4లోపు పూర్తి చేయాల‌ని కోర్ట్ ఆదేశించింది.