గుంటూరులో దారుణం.. చెల్లి, భార్యపై భర్త కత్తితో దాడి..

అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి భార్య, ఆమె చెల్లెలిపై కత్తితో దాడికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని దాచేపల్లి మండలం నారాయణపురంలో కలకలం సృష్టిస్తోంది.

అయితే అదే గ్రామానికి చెందిన శివ, జానీ బేగం ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి నాలుగు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఈ మధ్య ఈ దంపతుల మధ్య తరుచూ గొడవలు జరగడం స్టార్ట్ అయ్యాయి.

అదేవిధంగా ఆదివారం సాయంత్రం వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన శివ కత్తితో భార్యను పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన ఆమె సోదరిపై కూడా కత్తితో దాడికి దిగాడు. స్థానికులు బాధితులిద్దరినీ చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.