బల్బీర్ మృతిపై క్రీడాలోకం నివాళి..

భారతదేశపు అత్యుత్తమ హాకీ ఆటగాళ్ళలో ఒకరైన బల్బీర్ సింగ్ 2వారాలకు పైగా ఆరోగ్య సమస్యలతో పోరాడి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. భారత హాకీ దిగ్గజం కోల్పోవడంతో భారత క్రీడాకారులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు. బల్బీర్ సింగ్ ఈ రోజు ఉదయం మొహాలిలో తుది శ్వాస విడిచారు. మూడుసార్లు ఒలంపిక్స్ లో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు.

భారత కీర్తిని ఇనుమడింప జేసిన గొప్ప హాకీ ఆటగాడు అయిన బల్వీర్ సింగ్ పై క్రీడాకారులు స్పందించారు. ‘బల్బీర్ సింగ్ సీనియర్. ఆయన మరణ వార్త నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాను’ అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. అలాగే హర్భజన్ సింగ్ కూడా ‘భారత క్రీడల డొయెన్ బల్బీర్ సింగ్ సీనియర్ ఇక లేరు. మీరు అతని విజయాలను తిరిగి చూసినప్పుడు, మీరు ఆశ్చర్యపోతారు. 3 ఒలింపిక్ బంగారు పతకాలు, ఒలింపిక్ ఫైనల్లో ఐదు గోల్స్.. ప్రపంచ కప్ విజేత జట్టు మేనేజర్. బహుశా భారతదేశం గొప్ప క్రీడా చిహ్నాలలో ఒకటి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ స్పందంచారు. ఇంకా భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి, భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, అభినవ్ బింద్రా అలాగే హాకీ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ వంటి వారు బల్బీర్ సింగ్ మృతికి నివాళులర్పించారు.