ఎవరా 12 మంది ?

12-ysrcp-mlas-ready-for-jumping-into-tdp-party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నంద్యాల బాంబ్ పేలింది .కాకినాడ పటాస్ డాం అంది. ఆ పేలుళ్లదాటి ప్రకంపనలు మాత్రం వైసీపీ లో ఇంకా కొనసాగుతూనే వున్నాయి. 2019 మీద ఆశలు పెట్టుకున్న ఎంతోమంది ఇక వైసీపీ లో కొనసాగి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చారట. అలా వచ్చిన వారిలో ఓ 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో వున్నారని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేవలం టచ్ లోకి రావడమే కాదు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా అచ్చెన్న చెప్పారు. దీంతో వైసీపీ కి పెద్ద పని పడింది. ముందు ఆ 12 మందిని కనుక్కోవడం, ఆ తర్వాత వారిని బుజ్జగించడం.

లండన్ లో ఉన్న జగన్ పార్టీ ముఖ్యులకు ఆ బాధ్యత అప్పగించారట. అయితే 12 మందిని కనుక్కోవడం పెద్ద ఇబ్బందిగా మారిందట. పార్టీ డౌట్ పడుతున్న నాయకులు ఎవరిని కదిలించినా అసలు ఆ ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదట. అలాంటప్పుడు లేనిపోని సమస్య సృష్టించినట్టు అవుతుందేమోనని వైసీపీ అధిష్టానం టెన్షన్ పడుతోంది. అటు టీడీపీ నాయకులు పనిలో పనిగా కొన్ని పేర్లు సోషల్ మీడియాకి వదిలి తమాషా చూస్తున్నారు. దీంతో టీడీపీ మైండ్ గేమ్ ని తట్టుకుని నాయకుల్ని నిలబెట్టుకోవడం వైసీపీ కి అగ్నిపరీక్షగా మారింది.