ఏపీలో 161కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  గంటగంటకూ పెరుగుతోంది. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఈరోజు.. ఉదయం 10 గంటలకు ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 161కు చేరింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలో కరోనా కేసులు ఉన్నాయి. ఇక, జిల్లాల వారీగా పరిశీలిస్తే…
– అనంతపురం 02
– చిత్తూరు 09
– తూర్పు గోదావరి 09
– గుంటూరు 20
– కడప 19
– కృష్ణా జిల్లా 23
– కర్నూలు 01
– నెల్లూరు 32
– ప్రశాశం జిల్లా 17
– విశాఖపట్నం 14
– పశ్చిమ గోదావరిలో 15

ఏపీలో 161కి చేరిన కరోనా కేసులు - Telugu Bullet