కరోనాతో పద్మశ్రీ గ్రహీత నిర్మల్ సింగ్ మృతి

ప్రస్తుతం ప్రపంచానికి పట్టిన మహమ్మారి కరోనా వైరస్.. ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. మన దేశాన్ని పట్టిపీడిస్తోంది ఈ కరోనా వైరస్. ఇండియాలో కూడా కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా సిక్కు ఆధ్యాత్మిక గీతాలను ఆలపించే ప్రఖ్యాత గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్‌సింగ్‌ (62) కరోనాతో మృతి చెందాడు.

కాగా ఈ మధ్యనే ఆయన లండన్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో తాజాగా ఆయనకు వైద్య పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్‌ అని తేలింది. అంతేకాకుండా మార్చి 19న చండీగఢ్‌లో భారీఎత్తున జరిగిన కీర్తన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఆయన మృతితో ఆయను కలిసిన వారిలో కలవరం మొదలైంది. ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి.