పడక సుఖం కోసం వెళ్ళి….ప్రియురాలి చేతిలో మరణం…!

21 Year Old Youth Killed By His Girlfriend Mixing Poison In His Drink

పడక సుఖం పది నిముషాలైనా దాని పరవశానం జీవితాంతం సంక నాకించును అని ఈ మధ్య విడుదలయిన సూపర్ హిట్ సినిమా RX 100 లో ఒక డైలాగ్ ఉంటుంది. వినడానికి కాస్త ఇబ్బంది కరంగా ఉన్నా ఈ మాట పచ్చి నిజం, ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల నేపధ్యంలో వచ్చిన ఎన్నో వార్తలు మనం చూశాం, చూస్తున్నాం. వివాహేతర సంబంధం నేపధ్యంలో చేతికొచ్చిన పదిహేడేళ్ళ కొడుకుని చంపుకున్న తల్లి గురించి విన్నాం, భర్త ఆఫీస్ కెళ్ళాక బిర్యానే పాయింట్ లో పని చేసే కుర్రాడితో రాసలీలలు ఆడడానికి అడ్డుగా ఉన్నారని ముక్కుపచ్చలారని పసి బిడ్డలకు విషమిచ్చి చంపిన తల్లి గురించి విన్నాం. ఎటు పోతోందీ లోకం ? తాజాగా పడక సుఖం కోసం తన వద్దకు వచ్చిన ప్రియుడుకి విషం కలిపిన మద్యాన్ని తాగించిన ప్రియురాలు అతన్ని చంపింది. ప్రియురాలు ప్రేమతో ఇస్తుందిఅనుకుకున్న ప్రియుడు ఆ విషం కలిపిన బీరు తాగి చనిపోయాడు. ఈ అదును కోసమే చూస్తున్న ప్రియురాలు పారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం కలిగించిన ఈ హత్య కేసు మిస్టరినీ పోలీసులు ఛేదించారు.

mixing-beer
వారు చెబుతున్న వివరాల ప్రకారం ఎటావా జిల్లాకు చెందిన అన్షుల్‌ ఔరియాలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. ఆరు నెలల కిందట కాలేజీలో ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సదరు యువతి హరోల్లా గ్రామంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆ యువతి మాయలో పడిన అన్షుల్, సెప్టెంబరు 5 న ఇంట్లోని రూ.1.5 లక్షలు తీసుకుని నొయిడాకు ఆమెతో పాటు ఆమె ఇంటికి పారిపోయాడు. సెప్టెంబరు 6న అన్షుల్‌తో విషం కలిపిన బీరు తాగించిన ఆ యువతి అతని వద్దనున్న డబ్బు తీసుకుని అక్కడ నుంచి పరారైంది. ఈ సమయంలో తన తల్లికి ఫోన్‌చేసిన అన్షుల్ బీరు తాగిన తర్వాత తాను తీవ్ర అస్వస్థతకు గురయ్యానని, బతికే అవకాశం లేదని చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లి, అన్షుల్‌ను వెదుక్కొంటూ నొయిడాకు వచ్చినా అతడి ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెక్టర్ 15 మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. అతడు తన కుమారుడు అన్షుల్‌గా ఆమె గుర్తించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె వేటలో పడ్డారు.

possion