ఆరేళ్ళ బాబుని చిదిమేసిన ఆటో

5 year old at uppal auto accident

 5 year old at uppal auto accident

రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. అతివేగం, నిబంధనలు పాటించకపోవడం, వాహనాలు, రోడ్ల స్థితిగతులు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. యువత జాగ్రత్తలు పాటించకుండా ఏమైనా చూసుకోవచ్చులే అని అతి వేగంతో వెళ్లడంతో ప్రమాదాలు జరిగి, మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. వేగంగా వస్తున్న ఆటో బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి ఎక్కడో రోడ్డు మూలాన నడుకుంటూ వెళుతున్న ఓ కుటుంబాన్ని గుద్దేయడంతో ఓ పిల్లాడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా మారడంతో తండ్రి కొడుకును ఎత్తుకుని రోదిస్తున్న వైనం స్థానికులను కలచివేసింది. ఉప్పల్ సమీపంలోని రామాంతపూర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది.

 uppal auto accident

 

అందుతున్న సమాచారం మేరకు రామాంతపూర్ లో నివసించే ఉమేశ్ తన భార్యా,పిల్లలతో కలసి షాపింగ్ కు బయలుదేరాడు. కుమారుడు మోహిత్(5)తో కలసి ఉమేశ్ ముందు నడస్తుండగా, భార్య రెండో కుమారుడిని ఎత్తుకుని వెనుక వస్తోంది. ఇంతలో ఎదురుగా రోడ్డుపై ఓ ఆటో వేగంగా వచ్చి రోడ్డుపై వెళుతున్న బైక్ ను తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ వాహనాన్ని పక్కు కట్ చేయడంతో ఒక్కసారిగా ఆటో వీరిపైకి దూసుకొచ్చింది. పక్కకు వొరిగిపోతూ ఉమేశ్, మోహిత్ లను ఢీకొట్టింది. ఆటో బలంగా తలగడంతో ఉమేశ్ అల్లంతదూరం ఎరిగిపడగా, మోహిత్ ఆటోకు, ఫుట్ పాత్ కు మధ్య నలిగిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడ్డ తండ్రి కొడుకుని ఎత్తుకుని రోదించడం అక్కడున్నవారిని కలచివేసింది.